రోజు రోజుకి ప్రపంచంలో కరోనా వైరస్ మహమ్మారి దండయాత్ర కొనసాగుతూనే ఉంది. దీని వల్ల అనేక మంది చనిపోగా లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. ఒకవైపు పని లేక, మరోవైపు తిండిలేక ప్రజలు ఆకలితో అలమటిస్తూ చనిపోతున్నారు కూడా. ఇక మన భారతదేశం లాంటి దేశాలలో వలస కార్మికుల పరిస్థితి వర్ణనాతీతం. ఇకపోతే ఈ వైరస్ కొరకు అనేక శాస్త్రవేత్తలు, అనేక పరిశోధనలు చేస్తూ దానికి విరుగుడు కనుగొనుటకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఇకపోతే మన దేశంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ అండ్ రీసెర్చ్ విద్యాసంస్థ కరోనా వైరస్ నియంత్రణ అవసరాలు తయారీకి చాలా కష్టపడుతూ ముందుకు తీసుకెళ్తుందని ఆ సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్ చంద్రయ్య తెలిపారు. శుక్రవారం నాడు ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నైపర్ ఫార్మస్యూటికల్ సంస్థ భారతదేశం అత్యధిక ప్రతిష్టాత్మకంగా నిలబడుతుందని ఆయన తెలియజేశారు. దేశంలో నైపర్ సంస్థ ఎంటెక్, పీహెచ్డీ, ఎమ్మెస్ విద్యను అందిస్తూ దేశానికి కావాల్సిన అనేక మంది సైంటిస్టులును తయారు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ వైరస్ ను అరికట్టడానికి కావాల్సిన అనేక కొత్త మందులను తయారుచేయడంలో నైపర్ దృష్టి పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇందుకోసం 10 రీసెర్చ్ ప్రతిపాదనలు ఫండింగ్ ఏజెన్సీ కి దరఖాస్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 


ఇకపోతే కరోనా కట్టడి చేయడానికి కొత్త మందులు covid-19 వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపించే విధంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక అలాగే ఊపిరితిత్తుల మీద మాత్రమే కాకుండా ఈ వైరస్ ఎక్కడ ఎక్కువ దాని ప్రభావాన్ని చూపిస్తుందో వాటిపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపాడు. ఇక ఈ వ్యాధి నిర్మూలనలో భాగంగా నాసల్ స్ప్రే తెరపి ఫార్ములేషన్ డెవలప్మెంట్ చేస్తున్నట్లు ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇకపోతే కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడానికి ప్రయోగశాలలో అవసరమైన  లెవెల్ 3 ప్రయోగాలు కోసం ఈఎస్ ఐసి మెడికల్ కాలేజీ తో తాము ఒప్పందం చేసుకుంటున్నట్లు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: