ఈ మద్య కొంత మంది మనుషులు అడవిలో మృగాలకన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు.  వాటికి కేవలం ఆకలి అయితే తప్ప ఇతర జంతువుల జోలికి వెళ్లవు.. కానీ ఈ మనుషులు మాత్రం చిన్న చిన్నకారణాల వల్ల ఎదుటి వారిని అత్యంత దారుణంగా హింసించి మరీ చంపుతున్నారు.  ఈ మద్య కేరళాలో కొంత మంది కృరమృగాలు నిండు గర్భంతో ఉన్న ఏనుగు నోట్లు బాంబు ఉన్న పండు పెట్టి చంపారు.  పద్నాలు రోజుల పాటు చిత్ర హింసలు అనుభవించి ఆ ఏనుగు చనిపోయింది. ఈ విషయం పై దేశం మొత్తం ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి.  ఇక మనుషులను అత్యంత కృరంగ చంపుతున్నారు.  ఇక ఆడవారు కనిపిస్తే చాలు లైంగిక వేధింపులు.. అత్యాచారాలు ఆపై హత్యలకు పాల్పడుతున్నారు. ప్రతిరోజు ఇలాంటి దారుణహైన కేసులు ఎన్నో వస్తున్నాయి. పోలీసలు కలగజేసుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

అయితే నింధితులకు కఠినమైన శిక్షలు పడకపోవడం వల్ల బయటకు వచ్చి మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా  మేకను చోరీ చేశాడంటూ ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపి రైలు పట్టాల పక్కన పడేశారు గ్రామప్రజలు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో శుక్రవారం ఈ ఘోరం జరిగింది.  బారిపద పట్టణంలోని పలబణి చాంచా ప్రాంతంలో అభి కలాండి అనే 50 ఏళ్ల వ్యక్తి ఓ మేకను చోరీ చేశాడని జనం అతనిపై పడ్డారు. కర్రలతో, కాళ్లూచేతులో కొట్టి హింసించారు.  అయితే తాను నేరం చేశానని.. తప్పయ్యిందని దండం పెట్టాడు.. ప్రాదేయ పడ్డాడు.. కానీ జనం మాత్రం కృరంగా హింసించి కొట్టారు.. పాపం ఆ దెబ్బలు తట్టుకోలేక వ్యక్తి కేకలు వేస్తూ అక్కడే మరణించారు.

 

అతడు చనిపోయాడని తెలుసుకున్న తర్వాత వారంత భయపడ్డారు... ఎలాగైనా ఇది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అతని మృతదేహాన్ని సమీపంలోని రైలు పట్టాల వద్ద పడేశారు. ఆత్మహత్య చేసుకున్నట్లు కలరింగ్ ఇవ్వాలనుకున్నారు. అయితే పట్టపగలు అంతమంది చూస్తుండగా జరిగిన దాడి ఫొటోలు, వీడియోలు బయటికి రావడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: