భారతదేశం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మనదేశం యొక్క సత్తా కారణంగా కాదు. మనదేశంలోని వివిధ పరిణామాల వల్ల. ఔను. ఇప్పటికే కరోనా కేసుల్లో ఇటలీని దాటిన మన దేశం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ ఆరో స్థానంలో ఉంది. ఇంతటితోనే షాక్ అవుతోంది. వారం రోజుల క్రితం తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్ కేవలం ఏడు రోజుల వ్యధిలో ఆరో స్థానానికి చేరింది. భారత్లో గత 24 గంటల్లో 9887 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి.
భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,36,657కి చేరగా, మృతుల సంఖ్య 6642కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 1,15,942 మంది చికిత్స పొందుతుండగా, 1,14,073 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో రికవరీ రేటు శుక్రవారం కంటే కొద్దిగా తగ్గి 48.20 శాతానికి చేరింది. నిన్న ఇది 48.27 శాతం ఉన్నది. అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర (80229) మొదటిస్థానంలో ఉండగా, 28,694 పాజిటివ్ కేసులతో తమిళనాడు, 26,334 కరోనా కేసులతో ఢిల్లీ వరుగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ (19094), రాజస్థాన్ (10,084), ఉత్తరప్రదేశ్ (9733), మధ్యప్రదేశ్ (8996), పశ్చిమబెంగాల్ (7303) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా, దేశంలో మృతుల సంఖ్య ఇలాగే కొనసాగితే తొందర్లోనే కెనడాను (7703)ను దాటే అవకాశం ఉంది.
ఇదిలాఉండగా, దేశవ్యాప్తంగా పలు చోట్ల కరోనా లాక్ డౌన్ మినహాయింపులతో ప్రజా రవాణా తిరిగి ప్రారంభమైనా జనం మాత్రం అటు వైపు చూసేందుకు ఇష్టపడటం లేదు. కరోనా వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి ప్రజా రవాణాకు దూరంగా ఉండటమే మేలని జనం భావిస్తున్నారు. దీంతో ప్రజా రవాణాకు బదులుగా వ్యక్తిగత వాహనాలు కొనుక్కునేందుకే జనం ఇష్టపడుతున్నారు. తాజాగా పెరిగిన వ్యక్తిగత వాహనాల అమ్మకాలే ఇందుకు నిదర్శనం. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రెండు వారాల్లో పదివేల వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు జరిగినట్లు ఆటోమొబైల్ సంస్ధల యజమానులు చెబుతున్నారు.