ప్రస్తుత సమాజంలో కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి అక్రమ సంబంధాలు. ఈ విషయంలో రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాలకు జనాలు బాగా అలవాటు పడటంతో ఎవరితో పడితే వారితో రిలేషన్ పెట్టుకుని కుటుంబాలను బజారు పాలు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. సోషల్ మీడియా వల్ల ఎక్కువగా కాపురాలు కూలిపోతున్నాయి. ఎక్కడెక్కడి వారితో అపరిచిత వ్యక్తులతో అనవసర పరిచయాలు చాటింగులు మరియు వీడియో కాలింగ్ లు తో కొంప కొల్లేరు చేసుకుంటున్నారు.

IHG

సరిగ్గా ఇటువంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో జరిగింది. తొమ్మిదేళ్ల భర్తతో కాపురం చేసిన వివాహిత… సోషల్ మీడియా లో పరిచయమైన వ్యక్తితో లేచిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కొత్లాపూర్ కు చెందిన విక్రమ్ గౌడ్ అదే గ్రామానికి చెందిన అనితను తొమ్మిదేళ్ల క్రితం పెళ్ళి చేసుకున్నాడు. వీళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు. అనితా కు కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా లో ఆలీ ఇమ్రాన్ షేక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

IHG's cheating husbands - Marketplace

అయితే ఇటీవల లాక్ డౌన్ సమయములో అనిత ఎక్కువగా స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా లోనే ఉంటూ అతగాడి తోనే ఉంటూ చాటింగ్ చేస్తూ ఉండేది. ఈ క్రమంలో వారిద్దరూ ఒకరి ఫోన్ నంబర్లు ఒకరు తెలుసుకొని ఫోన్లో మాట్లాడుకుని గత నెల 26వ తేదీన అనిత ఇంటి నుంచి బయటికి వెళ్లి అలీ ఇమ్రాన్ షేక్ అనే వ్యక్తితో లేచిపోయింది. దీంతో భర్త విక్రమ్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: