నందమూరి బాలకృష్ణ ఇంట మరి కొద్ది రోజుల్లో శుభకార్యం ఏం జరగబోతోంది. జూన్ 10 వ తేదీన బాలయ్య పుట్టినరోజు వేడుకలను ధూమ్ థాం గా  నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అదేరోజు బాలయ్య షష్టిపూర్తి మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారట. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని పిలవాలని బాలయ్య డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బాలయ్య తన పుట్టినరోజుతో పాటు మరో స్పెషల్ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ లో ప్రముఖులను, రాజకీయ ప్రముఖులను పిలవాలని చూస్తున్నారు. 

 

IHG


ఇటీవలే టాలీవుడ్ ప్రముఖులతో బాలయ్యకు వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చాటిచెప్పేందుకు బాలయ్య ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమానికి చిరంజీవిని పిలవడం ద్వారా తమ మధ్య ఏర్పడిన వివాదానికి పులిస్టాప్ పెట్టినట్లే అవుతుంద ని బాలయ్య ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో తాను అభాసుపాలయ్యానని, ఇది తన సినీ కెరియర్ తో పాటు, రాజకీయంగా ఇబ్బంది తెచ్చే అంశం కావడంతో బాలయ్య ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 

IHG


ఇప్పటికే ఈ నెల 9 వ తేదీన టాలీవుడ్ ప్రముఖులంతా చిరంజీవి నేతృత్వంలో ఏపీ సీఎం జగన్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకోవడం, దానికి బాలయ్యను పిలవడం, ఆయన తన పుట్టినరోజు వేడుకల కారణంగా తాను వచ్చేందుకు అవకాశం లేదని చెప్పడం జరిగిపోయాయి. ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలబోతున్నారట. అలాగే బాబాయ్ కి జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ కలిసి ఏదో స్పెషల్ గిఫ్ట్ కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇక బాలయ్య పుట్టినరోజు, షష్టిపూర్తి కి సంబంధించి ఇప్పటికే బాలయ్య ఇంట హడావుడి మొదలయిపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: