ఎన్ని సంవత్సరాలు గడిచిన.. ఎంత టెక్నాలజీ పెరిగిన.. ఆడపిల్లలు రాజ్యాలు ఏలుతున్న సరే ఆడపిల్లపై వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ సమాజం ఇప్పుడు కాదు మరో యుగం వచ్చిన మారదు అనిపిస్తుంది కొన్ని ఘటనలు చూస్తే. అలాంటి దారుణమైన ఘటనే తమిళనాడులోని జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని పెరుందురై జిల్లాకు చెందిన గుణశేఖరన్, సంగీత దంపతులకు మూడు నెలల క్రితం ఓ ఆడబిడ్డ జన్మించింది. అయితే పుడతాడు అని అనుకున్న ఆమెకు ఆడబిడ్డ పుట్టేసరికి తీవ్ర నిరాశకు గురైంది. దీంతో ఆ బిడ్డపై రోజు రోజుకు కోపం పెంచుకుంటూ వచ్చింది. ఇంకా ఆ కోపంతో మూడు నెలల పసికందుని నీళ్ల టబ్బులో ముంచి కర్కశంగా చిన్నారి ప్రాణాలు తీసింది.
అంతే బిడ్డ ప్రాణాలు తీసినందుకు మనస్థాపానికి గురిందో ఏమో తెలియదు కానీ వెంటనే తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే సాయింత్రం ఇంటికి తిరిగివచ్చి చుసిన భర్తకు ఆ సేవలను చూసి షాక్ కి గురయ్యాడు. భార్య శవాన్ని చుసిన భర్త వెంటనే కూతురు కోసం ఇల్లంతా వెతకగా ఓ టబ్బులో విగతజీవిగా కనిపించింది.
ఇంకా వెంటనే అదే గ్రామంలో ఉంటున్న భార్య సోదరుడు కుమార్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. పెరుందురై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరి పరిశీలించారు. తల్లి కూతుర్ల మృతుదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆడబిడ్డను చంపుకోవడం పెద్ద నేరం. అలానే పుట్టిన ప్రతి కొడుకు మిమ్మల్ని చూస్తాడు అని అనుకోవడం మీ పొరపాటు.