దేశంలో కరోనా మహమ్మారితో ఓ వైపు ఛస్తుంటే.. ఇదే సమయంలో తుఫాన్ లు వచ్చి పడుతున్నాయి. మరోవైపు మిడత గొలతో మహరాష్ట్ర, రాజస్థాన్ వాసులు తల్లడిల్లిపోయారు.. ఎంతో పంట నష్టం జరిగింది.  ఇలా రోజుకో ఉప్పెన వచ్చి మీద పడుతుంది. ఇక దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా మహరాష్ట్రపై పడింది.  అందులోనూ ముంబాయి లాంటి మహానగరంలో మరణమృదంగం వాయించింది.  ఇది చాలదన్నట్లు ఇప్పుడు కొత్త ఇబ్బందులు వచ్చి పడ్డాయంటున్నారు. ఇటీవలే వైజాగ్ నగరంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకై 14 మంది మృతి చెందిన ఘటన దేశంలో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో, ముంబయి మహానగరంలో గత అర్ధరాత్రి నుంచి ఓ అంతుచిక్కని వాసన ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.

 

ఈ వాసన ఎక్కడ్నించి వస్తుందో కూడా ఇంతవరకు పసిగట్టలేకపోయారు. కంపెనీలు రెండు నెలల మూసి వేసి కనీసం భద్రత చర్యలు తీసుకోకుండా తీయడం తర్వాత వచ్చే సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఈ మద్య వరుసగా కెమికల్ కంపెనీల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.  ముంబయిలోని అంధేరి, ఘట్కోపర్, విఖ్రోలీ, చెంబూర్  తదితర ప్రాంతాల్లో భరింపరాని వాసన వస్తుండడంతో ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం గురించి తెలుసుకున్న  అధికారులు గ్యాస్ లీక్ గా భావించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. వారికి తోడు 17 ఫైరింజన్లు కూడా ఈ వాసన ఎక్కడ్నించి వస్తుందో కనిపెట్టేందుకు విఫలయత్నం చేశాయి.

 

అంతేకాదు, ప్రమాదకర రసాయన పదార్థాలను గుర్తించే హజ్మత్ వాహనాన్ని కూడా తీసుకువచ్చినా ప్రయోజనం లేకపోయింది. సమీపంలోని రసాయన పరిశ్రమలు, చమురు కంపెనీలను పరిశీలించినా అసలు ఆ వాసన ఎక్కడ్నించి వస్తున్నదో కూడా గుర్తించలేకపోయారు. ఇది ఎక్కడో గ్యాస్ లీక్ ద్వారా వస్తుందని..  భావిస్తున్న అధికారులు, దాని మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: