కేరళ లో కూడా కరోనా కేసుల సంఖ్య 2000 దాటింది. గత కొన్ని రోజుల నుండి భారీగా సంఖ్యలో కేసులు నమోదవుతుండగా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. ఈ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 91 కేసులు నమోదు కాగా ఓ మరణం కూడా సంభవించింది. ఈకొత్త కేసుల తో కలిపి కేరళలో ఇప్పటివరకు మొత్తం 2005కేసులు నమోదుకాగా అందులో 1174కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 814 బాధితులు కొరోనా నుండి కోలుకోగా 16మంది మరణించారు.
ఇక దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈరోజు కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. అందులో భాగంగా మహారాష్ట్ర లో ఈఒక్క రోజే 2553కేసులు నమోదు కాగా తమిళనాడు లో 1562, గుజరాత్ లో 477 ,ఉత్తరప్రదేశ్ లో 411, కర్ణాటక లో 308 అత్యధికంగా కేసులు నమోదమయ్యాయి. ఇంకా కొన్ని రాష్ట్రాల నుండి రిపోర్ట్ రావాల్సి వుంది. ఇక ఈరోజు కూడా దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 9000 దాటనుంది. ఓవరాల్ గా ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 260000దాటగా 7500 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి.