ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని కాసేపట్లో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు కలవనున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయి  ఏడాది అయిపోయింది. కనీసం ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా అభినందించడానికి వచ్చిన వారు ఒక్కడు కూడా లేరు. చాలా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే తెలుగుదేశం పార్టీకి బ్రాంచ్ ఆఫీస్ అనే ముద్ర రాజకీయాల్లో ఏర్పడింది. అటువంటిది వైయస్ జగన్ తాను ముఖ్యమంత్రి అయ్యాక విశాఖపట్టణంలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న వార్తలు అందగానే ఇండస్ట్రీలో చాలామంది ఏపీ సీఎం జగన్ ని కలవటానికి బయలుదేరడం జరిగింది.

IHG

ఇప్పుడు ఇదేవిధంగా అమరావతి రాజధానిగా కోరుకుంటున్న వారు నిలదీస్తున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలను. తాజాగా అమరావతి జేఏసీ మహిళా విభాగం నేత సుంకర పద్మశ్రీ ఈ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి గురించి గానీ దానికి భూములు ఇచ్చిన వారి గురించి గానీ మీకు అసలు పట్టదు కానీ ఆంధ్రాలో మీకు భూములు కావాలా ? అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలను ఆమె ప్రశ్నించారు.

IHG

అమరావతిని రాజధానిగా ఉంచమని సీఎం జగన్ కు చెప్పాలని అప్పుడు మీరు నిజమైన హీరోలు అనిపించుకుంటారు అని ఆమె కోరుతున్నారు. నిజంగా సుంకర పద్మశ్రీ కోరినట్టు వై.ఎస్.జగన్ ని అడిగే అంత దమ్ము సినీజనాలకి ఉంటుందా అని ఆమె చేసిన వ్యాఖ్యలకు మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి ఎప్పుడూ తమ వ్యక్తిగత లాభం కోసమే ఆలోచిస్తారు ప్రజల గురించి ఆలోచించే సమయం వారికి ఉండదని మరికొంత పద్మశ్రీ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: