తాజాగా కర్ణాటక ఆరోగ్య శాఖ కరోనా వైరస్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది. గడిచిన 24 గంటలలో కొత్తగా 161 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 5921 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి పూర్తి ఆరోగ్యంతో 164 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి వారి ఇంటికి చేరుకున్నారు. దీనితో రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 2605 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. నేటితో రాష్ట్రం మొత్తం మీద 3248 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
Covid19 Bulletin: 9th june 2020
— cm of karnataka (@CMofKarnataka) June 9, 2020
Total Confirmed Cases: 5921
Deceased: 66
Recovered: 2605
New Cases: 161
Other information: Telemedicine facility, Instructions to Tablighi Jamaat Attendees, Corona watch application and Helpline details.1/2 pic.twitter.com/hQqhpUsyw7
గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా రాష్ట్రం మొత్తం మీద ఇద్దరు మరణించారు. దీనితో రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు 66 మంది మృతి చెందారు. ఇందులో 12 మందికి తీవ్రంగా పరిస్థితి విషమించడంతో వారిని ఐసియులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం మీద విదేశాల నుంచి వచ్చిన మొత్తం 24 మందికి కొత్తగా కేసులు నమోదయ్యాయి. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 91 మంది కి కరోనా పాజిటివ్ గా తేలింది. పది రోజుల నుంచి కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తోంది.