కేరళలో కరోనా ఏమాత్రం కంట్రోల్ కావడం లేదు. గత కొద్దీ రోజులుగా భారీగా కేసులు నమోదవుతుండగా  ఈరోజు కూడా భారీగా కేసులు బయటపడ్డాయి. ఈఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 91 కేసులు నమోదు కాగా అందులో 80 విదేశాలు నుండి వచ్చినవి కాగా మిగితా 11 కాంటాక్ట్ కేసులు. ఈ11 కేసుల్లో ఓ హెల్త్ వర్కర్ కు కూడా కరోనా సోకింది. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో ఇప్పటివరకు మొత్తం 2096 కేసులు నమోదుకాగా అందులో 1231కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 848 బాధితులు కరోనా నుండి కోలుకోగా 16మంది మరణించారు. 
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడు లో ఈరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కరోజే 1685 కేసులు నమోదు కాగా 21 మంది మరణించారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34000కు చేరింది కాగా ఇప్పటివరకు 300కుపైగా కరోనా మరణాలు సంభవించాయి అలాగే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈరోజు  147కేసులు నమోదుకాగా తెలంగాణ లో178 కేసులు బయటపడ్డాయి. ఓవరాల్ గా దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 270000 దాటగా 7600మరణాలు చోటుచేసుకున్నాయి.    
 

మరింత సమాచారం తెలుసుకోండి: