ప్రమాదం అనేది ఏ మూల నుంచి వస్తుంది అసలు ఊహించలేము. ఆ సమయం వరకు మనతో గడిపిన వారు కూడా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపే పరలోకానికి చేరి పోయే రోజులు ఇది. నిజానికి మనం చేసే చిన్న తప్పే మనకు ఏకంగా ఒక్కోసారి ప్రాణాల మీదకు తీసుకొని వస్తుంది. దానివల్ల ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా రావచ్చు. అంతే కాదు మనకు జీవితాంతం ఆ సంఘటన గుర్తుండిపోయేలా ఈ పరిస్థితి రావచ్చు. ఇలాంటి సంఘటనలు రోజు మనం ప్రపంచంలో ఏదో ఒక మూలన గమనిస్తూనే ఉంటాము. ఇలాంటి సంఘటనే ఒకటి మన భారతదేశంలో తాజాగా జరిగింది.

 

 

ఈ సంఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్ లో దారుణ సంఘటన జరిగింది. భూపాల్ దగ్గరలో ఉన్న కలియాసట్ డ్యాం లో ఇద్దరు వ్యక్తులు ఈతకు వెళ్లారు. వారు ఈతకు వెళ్లిన సమయంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. నిజంగా ఆ సంఘటన వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. వారు ఇద్దరు ప్రశాంతంగా స్నానం చేస్తున్న సమయంలో ఒక మొసలి సడన్ గా ఈత కొడుతున్న అమిత్ అనే వ్యక్తి పై దాడి చేసింది. అంతే అతని కాళ్లను ఏకంగా తన నోట్లోకి లాక్కుంది మొసలి. మౌతిక తీరం దాటే సమయంలో అక్కడే తన పక్కనే ఉన్న స్నేహితుడు తన ప్రాణానికి తెగించి తన స్నేహితుడు ను మొసలి నుంచి అతని ప్రాణాలు కాపాడాడు.

 


ఇక ఆ తర్వాత అమిత్ ను సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. అయితే ఈ సంఘటన మొత్తం వారు ఒడ్డున పెట్టిన మొబైల్ కెమెరా లో పూర్తిగా రికార్డు అయింది. మనం కనుక ఆ సన్నివేశంలో ఉంటే నిజంగా గుండెపోటు వచ్చినా రావచ్చు. తన స్నేహితుడు ప్రాణానికి తెగించి కాపాడకపోతే అతనికి మాత్రం భూమి మీద నూకలు చల్లి పోయి ఉండేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: