జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు వైయస్ జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల టైంలో వైయస్ జగన్ ని తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఇటీవల మాత్రం నాగబాబు చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న వైయస్ జగన్ చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి అని రాజకీయంగా మాత్రమే ఆయనని విమర్శించడం తప్ప … వైద్యం విషయంలో మరికొన్ని విషయాలో  వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి అంటూ మీడియా ముందే నాగబాబు చెప్పటం జరిగింది.

 

అయితే ఇటీవల మీడియా విషయంలో మాట్లాడిన నాగబాబు మరొకసారి వైయస్ జగన్ ధోరణి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే మీడియా చానల్స్ కి కరెక్ట్ అయిన వాడు వైయస్ జగనే అని అన్నారు. తెలుగుదేశం పార్టీ జెండా ని అజెండా ని మోస్తున్న కొన్ని మీడియా ఛానల్స్ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం వేస్తోందని చెప్పుకొచ్చారు.

 

చంద్రబాబు ప్రయోజనాలను కాపాడే విధంగా ఈ మీడియా ఛానల్స్ వ్యవహరిస్తున్నాయని… చంద్రబాబును బుజ్జగించడం లో ఆయనను భుజాన మోసుకోవటం లో తీరు పడుతున్న తాపత్రయం చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. ఇదే జర్నలిజమా అన్నట్లుగా ఉందని నాగబాబు సైటరికల్ గా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ పార్టీ కోసం పని చేసే బాబోరు మీడియాకి వైయస్ జగనే కరెక్ట్ అని నాగబాబు అంటున్నారు. దీంతో నాగబాబు చేసినా వ్యాఖ్యలు మరోసారి పెను దుమారాన్ని రేపాయి. కాగా ఉన్న కొద్దీ సొంత పార్టీ నుండి విమర్శలు వస్తున్నా గాని ప్రతిపక్షాల నుండి జగన్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఏపీ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు భవిష్యత్తులో చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: