దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి కేసులు.. మరణాలు మాత్రమే కాదు కొంత మంది మనుషులు ఉన్మాధులుగా మారుతున్నారు. లాక్ డౌన్ కొనసాగింపులో భాగంగా మద్యం షాపులు మూసి వేసిన సమయంలో కొంత మంది పిచ్చివాళ్లయ్యారు.. ఉన్మాధులుగా మారిపోయారు.  ప్రస్తుతం మద్యం షాపులు తెరిచారు.. ఇక మద్యం సేవించి కొంత మంది శాడీజం ప్రదర్శిస్తున్నారు.  ఇక దేశంలో కొంత కాలాంగా వరుసగా ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. ఎన్ని దిశ కేసులు, నిర్భయ కేసులు వచ్చినా.. వాళ్ల తీరు మాత్రం మారడం లేదు.  ఇది మాత్రమే కాదు భార్య భర్తల మద్య వైవాహిక సంబంధాలు కూడా తేడాలు రావడం ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకోవడం దాంతో చంపుకునే వరకు వెళ్లడం జరుగుతుంది.  

 

తాజాగా ఓ వ్యక్తి మరో వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హింసించి మరీ చంపాడు.. అయినా అతని ఆవేశం తగ్గలేదు.. నరరూప రాక్షసుడిలా మారిపోయి ఏకంగా అతని రక్తం కూడా తాగి దారుణంగా ప్రవర్తించాడు.  కర్నాటకలోని డీజెహళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నింధితున్ని విచారిస్తున్న పోలీసులకు అతడు చెప్పే మాటలు వింటుంటే గండె గుభేల్ మందట. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.  తబ్రేజ్ అనే వ్యక్తి భార్య సుభాన్ అనే వ్యక్తితో ప్రేమలో పడి అతనితో వెళ్లిపోయింది.  ఎంతో అపురూపంగా చూసుకుంటున్న తన భార్య అతని మోజులో పడి వెళ్లిపోవడం ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు.

 

తన భార్యను లోబరుచుకున్న సుభాన్‌ను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఓ రోజు అతని స్నేహితులు నిజామ్, అలీ ముగ్గురు కలిసి తుమకూరులో ఉన్న సుభాన్‌ మే నెలలో అపహరించి బెంగళూరుకు తీసుకొచ్చారు. అతన్ని దారుణమైన చిత్ర హింసలకు గురి చేసి.. కొట్టి చంపి తర్వాత నరరూప రాక్షసుడిలా మారిపోయి ఏకంగా అతని రక్తం కూడా తాగాడట. తన భార్యను తనకు కాకుండా చేశాడనే కోపంతోనే ఇలా చేశానని వెల్లడించాడు. కాగా నిందితుడిపై బెంగళూరులో జేబు దొంగతనం కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయని విచారణలో వెల్లడైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: