కరోనా వైరస్ కారణంగా దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. అయితే తాజాగా దేశంలో వడ్డీ రేట్లు బాగా తగ్గించారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రెపో రేటును తగ్గించింది. దింతో బ్యాంకులు కూడా ఇదే దారి పట్టాయి. బ్యాంకులు వడ్డీ రేట్లలో కోత విధిస్తూ వస్తున్నాయి. దీంతో వీటిల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే తక్కువ రాబడి వస్తుందన్నారు. మరి మంచి రాబడి పొందాలంటే ఏం చేయాలి? మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు.

 

 

మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ప్రతి నెలా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు అని తెలిపారు. ఈ క్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేస్తూ వెలితే దీర్ఘకాలంలో అదిరిపోయే రాబడి పొందొచ్చునన్నారు. రోజుకు రూ.100 ఆదా చేసుకుంటే ఏకంగా రూ.20 లక్షలు కూడా పొందొచ్చునని తెలిపారు. 

 

 

రోజుకు రూ.100 ఆదా చేస్తే.. నెలకు రూ.3,000 అవుతుందన్నారు. ఈ రూ.3 వేలను మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెలితే 15 ఏళ్లలో చేతికి ఏకంగా రూ.20 లక్షలు పొందొచ్చున్నారు. ఇక్కడ వార్షిక రాబడిని 15 శాతంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. అంటే మీరు 15 ఏళ్లలో రూ.5.4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారని యాజమాన్యం తెలిపారు.

 


మార్కెట్‌లో చాలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయన్నారు. అన్నీ ఒకే రకమైన పనితీరు కనబర్చవు అని తెలిపారు. అందువల్ల ఇప్పుడు 15 శాతం రాబడి అందించిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటివో చూద్దాం. ఎస్‌బీఐ ఫోకస్ట్ ఈ క్విటీ ఫండ్ 15.78 శాతం రాబడిని, ఎల్అండ్‌టీ మిడ్ క్యాప్ ఫండ్ 14.83 శాతం రాబడిని, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ 14.66 శాతం రాబడిని అందిస్తాయన్నారు. అంటే ఎస్‌బీఐ ఫండ్‌లో సిప్ చేస్తూ వచ్చి ఉంటే రోజుకు రూ.100తో రూ.20 లక్షలు వచ్చేవని అధికారులు తెలియజేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: