ఈ మద్య మనుషులు పూర్తిగా మానవత్వం మర్చిపోతున్నారు. ఇటీవల మూగజీవాలపై జరుగుతున్న దారుణాలే ఇందుకు సాక్ష్యం. కేరళాలలో నిండు గర్బంతో ఉన్న ఎనుగు చావుకు కారణం అయ్యారు.. ఓ కుక్క మూతికి ప్లాస్టర్ చుట్టారు.. ఓ ఆవు మేస్తున్న గడ్డిలో బాంబు పెట్టారు.. ఇలా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి.  ఇక  కొంత మంది మూర్ఖులు మనుషులపై కూడా ఇలాంటి దారుణాలకే పాల్పపడుతున్నారు. తాజగా చిన్న నేరం చేసిన సాకుతో ప్రాణాలు తీసేస్తున్నారు.   ఆ మద్య ఓ మేకను దొంగతనం చేశాడని 50 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపి రైలు పట్టాలపై వేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యారు. 

 

తాజాగా తన చిలుకలు ఎగిరిపోవడానికి కారణం ఓ చిన్న పాప అని కనికరం లేకుండా కొట్టి చంపాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఘటనలు వెలుగు లోకి వచ్చాయి. తాజాగా ఫ్యాన్ దొంగతనం చేస్తూ పట్టుబడిన దొంగలపై గ్రామస్థులు తీవ్ర స్థాయిలో దాడి చేశారు. చిత్రహింసలు పెడుతూ.. నరకం చూపించారు. ఆపై మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించారు. ముగ్గురి చేతులు కట్టేసి చావబాదారు. ఈ దారుణమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరగింది. 

 

ఓ వైపు కరోనాతో నానా తంటాలు పడుతున్నారు జనాలు.. ఆకలి కోసం కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు. బరౌలీఖలీదాబాద్ గ్రామంలో ముగ్గురు వ్యక్తులు ఫ్యాన్ దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో వారిని పట్టుకున్న గ్రామస్థులు చితకబాదారు. చేతులు కట్టేసి, చెప్పుల దండను వేలాడదీసి గ్రామమంతా ఊరేగించారు.  అయితే వారంతా దళితులు కనుక వారి తరుపు నుంచి ఎవరూ మాట్లాడలేదు.. చేసింది పొరపాటే.. అయితే పోలీసులకు అప్పజెప్పకుండా ఇలా దారుణంగా హింసించడం ఏంటన్న విమర్శలు తలెత్తాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: