ప్రకృతిలో ఎన్నో వింతలూ విశేషాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని చిత్రాలు ఈ మద్య సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ప్రకృతి ఎంత శాంతంగా ఉంటుందో.. కోపం వస్తే ప్రళయమే అన్న విషయం తెలిసిందే. పచ్చటి చెట్టు.. వాగులు వంకలు.. జలపాతాలు వీటితో పాటు అందమైన పశు పక్షాదులు.. ఆకాశం ఇలా డిస్కవరి, నేషనల్ జియో గ్రాఫిక్ ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి అందాలు ప్రత్యక్షంగా చూడలేకున్నా.. ఎంతోమంది అనుభూతి పొందుతుంటాం. తాజాగా కొన్ని చోట్ల సరస్సులు చాలా చిత్రంగా ఉంటుంటాయి.
ఇలా ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా సరస్సులు దర్శనమిస్తుంటాయి. తాజాగా ముంబయికి 500 కిలోమీటర్ల దూరంలో బుల్హంద జిల్లాలో ఉన్న లోనార్ సరస్సులోని నీరు ఉన్నట్టుండి గులాబీ రంగులోకి మారిపోయింది. దీంతో పర్యాటకులతో పాటు శాస్త్రవేత్తలు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రంగు మారడం ఇదే మొదటిసారి కాదని.. అయితే ఈసారి బాగా ఎక్కువగా మారిందని నిపుణులు అంటున్నారు. సరస్సు నీరు రంగు మారడంతో స్థానికులు గుంపులు గుంపులుగా వచ్చి చూస్తున్నారు.‘ఈ సరస్సు జాతీయ స్మారక చిహ్నంగా ఉంది. ఈ సరస్సులో 10.5 పిహెచ్తో ఉప్పునీరు ఉంది.
నీటి లోపల ఆల్గేలు ఉన్నాయి. ఈ మార్పుకు లవణీయత, ఆల్గేలే కారణమవుతాయి. గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే లోనార్ సరస్సులో నీటి మట్టం ప్రస్తుతం తక్కువగా ఉంది. అందులో మంచినీరు చేరడానికి వర్షం లేదు. తక్కువ స్థాయి నీరు, వాతావరణ మార్పుల వల్ల లవణీయత, ఆల్గే వల్ల నీరు రంగు మారింది’ అని గజానన్ వెల్లడించారు. ఇరాన్లోని ఒక సరస్సు కూడా ఉప్పునీటి కారణంగా నీరంతా ఎర్రగా మారిపోయింది. ఇక లోనార్ సరస్సు సంరక్షణా కమిటీ సభ్యులు గజానన్ మాట్లాడుతూ.. కాగా, దాదాపు 50 వేల సంవత్సరాల క్రితం మంచు యుగంలో భూమి ఉపరితలాన్ని తాకిన ఉల్కాపాతం వల్ల లోనార్ సరస్సు ఏర్పడింది.