పుండు మీద కారం చల్లే విధంగా, తమ రాజకీయ ప్రత్యర్థులపై వేగంగ విమర్శల బాణాలు వేస్తూ, వారిని మరింత అల్లరి పెడుతూ.. వారికి మరింత ఆగ్రహాన్నికలిగిస్తూ ఆటపట్టిస్తూ వైసిపి నాయకులల్లో మరింత ఉత్సాహాన్ని పెంచే విధంగా వ్యవహరించడంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దూకుడును ప్రదర్శిస్తూనే వస్తున్నాడు.

IHG

తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచ్ డైలాగులు వేస్తూ విజయసాయిరెడ్డి టిడిపి నాయకులు అందరిని వ్యంగ్యంగా ఆటపట్టిస్తూ ఉంటారు. ఆ విధంగానే ఇప్పుడు అనేక అంశాలపై విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ముఖ్యంగా ఈ నెల 19వ తేదీన టిడిపి బలం ఏంటనేది తెలిసిపోతుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు.

 


 ''భోగాలు మీవి త్యాగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీల వా ?రాజ్యసభ సీట్లు గ్యారెంటీగా గెలుస్తారు అనుకున్నప్పుడు కనకమేడల లాంటి వారు అభ్యర్థులుగా ప్రత్యక్షమవుతారు. బలం లేని టైమ్ లో బడుగు వర్గాల అభ్యర్థులు బలి అవుతారు. ఈ నెల 19 నాడు మీ బలం ఎంతో, వెంట ఉండేది వదిలి పోయేది ఎవరో తేలిపోతుంది అంటూ సెటైర్ వేశారు. అలాగే ఫైబర్ గ్రిడ్ పై సిబిఐ  అనగానే  ఈవీఎంల  దొంగ వేమూరి హరిప్రసాద్ గుర్తుకొస్తాడు. తనను బదనాం చెయ్యడానికేనని చిట్టి  నాయుడు గుమ్మడికాయల దొంగలా రెస్పాన్స్.హరి కి ఫైబర్  గ్రిడ్  కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు? 200 కోట్ల అవినీతి అని కాబినెట్ sub committe తేల్చింది.చూద్దాం సిబిఐ ఏమి చెప్తోందో. అని ట్వీట్ చేశారు. 

ఇక మరో ట్విట్ లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు. కరోనాతో దేశమంతా భౌతిక దూరం పాటిస్తూ ఉంటే బాలకృష్ణ షష్టిపూర్తి సంబరాలు ఏంటి బాబు గారు ? మీరు అయినా చెప్పొచ్చు కదా, బావమరిదికి మెంటల్ సర్టిఫికేట్ ఉంది కదా అని కరోనా సమయంలో కూడా సెలబ్రేషన్ జరుపుకునే సాహసం చేస్తారా ఎవరైనా ? హిందూపురం ప్రజలను గాలికొదిలేసి అంటూ ఆయన ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: