దేశంలో రోజు రోజుకు కరోనా విజృభిస్తుంది. రోజులు గడుస్తున్నా కొద్దీ కరోనా బాధితుల సంఖ్యా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఇంకా రానున్న కాలంలో కరోనా బాధితుల సంఖ్యా పెరగనుందని నిపుణులు వాపోతున్నారు. తాజాగా గాంధీ ఆసుపత్రి వద్ద ఆందోళన కొనసాగుతూనే ఉంది. 

 

 

గత మూడు నెలలుగా కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తుండటంతో.. గాంధీ హాస్పిటల్‌లో పని చేసే డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని ఓ వైద్యురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ డాక్టర్లపై పని ఒత్తిడి తగ్గించాలని డాక్టర్ విజయ లక్ష్మీ ప్రభుత్వానికి సూచించారు. ‘‘గాంధీలో మెడికల్ కాలేజీలో సీటు వస్తే గ్రేట్‌గా ఫీలవుతారు.

 

 

కానీ రాబోయే తరంలో గాంధీలో మెడికల్ సీటు వద్దనే పరిస్థితి దాపురిస్తోంది. గాంధీ హాస్పిటల్లో మాత్రమే కరోనా పేషెంట్లకు చికిత్స ఎందుకు? ఆరోగ్య శ్రీతో ప్రయివేట్ హాస్పిటళ్లలోనూ కరోనా చికిత్స అందించొచ్చు. ఇలా చేస్తే గాంధీ హాస్పిటళ్లలో పని చేసే డాక్టర్లపై పని భారం తగ్గుతుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

 

 

లాక్‌డౌన్‌లో జనం 40 రోజులు ఇంట్లో ఉండలేక బయటకు వస్తున్నారని అంటున్నారు. కానీ గత 3 నెలలుగా గాంధీ హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్ల పరిస్థితి ఏంటి..? వాళ్లు పీజీ స్టూడెంట్లు, ఎక్కడికీ పారిపోరనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా చేస్తోందా? గాంధీలో డాక్టర్లు పడే మనో వేదనను అర్థం చేసుకోవాలి. గాంధీ నుంచి డాక్టర్లను షిఫ్ట్ చేయాలని డాక్టర్ విజయలక్ష్మీ సూచించారు.

 

 

కరోనా టెస్టులు పెంచాలని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆమె.. తెలంగాణ మరో ఇటలీ అవుతుందనడంలో సందేహం లేదని హెచ్చరించారు. డాక్టర్ల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని ఆమె ప్రభుత్వానికి సూచించారు. గాంధీ హాస్పిటల్లో మాత్రమే కరోనా పేషెంట్లకు చికిత్స ఎందుకు? ఆరోగ్య శ్రీతో ప్రయివేట్ హాస్పిటళ్లలోనూ కరోనా చికిత్స అందించొచ్చు. ఇలా చేస్తే గాంధీ హాస్పిటళ్లలో పని చేసే డాక్టర్లపై పని భారం తగ్గుతుంది.. అని ఆమె వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: