గత రెండు వారాల నుంచి కర్ణాటకలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇకపోతే ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కేసులు ఎక్కువగా ఉండడం గమనించాల్సిన విషయం. ఇకపోతే నేడు కర్ణాటక ఆరోగ్య శాఖ గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు బులిటెన్ ను విడుదల చేసింది. ఇంకా అందులోని విశేషాలు చూస్తే... ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 271 కేసులు కొత్తగా నమోదయ్యాయి. అయితే ఎప్పుడు లేని విధంగా నేడు ఒక్కరోజే 464 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.
Covid19 Bulletin: 12th june 2020
— cm of karnataka (@CMofKarnataka) June 12, 2020
Total Confirmed Cases: 6516
Deceased: 79
Recovered: 3440
New Cases: 271
Other information: Telemedicine facility, Instructions to Tablighi Jamaat Attendees, Corona watch application and Helpline details.1/2 pic.twitter.com/BFjxxo0zPv
నేటి కేసులతో కలిపి రాష్ట్రంలో 6516 కు కరోనా కేసుల సంఖ్య పెరిగింది. నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 3440 మంది సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వారి ఇళ్లకు చేరుకున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం 2995 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. నేడు ఒక్కరోజే రాష్ట్రం మొత్తంమీద ఏడు మంది మరణించారు. దీనితో రాష్ట్రం మొత్తం మీద మరణాల సంఖ్య 79 కి చేరుకుంది.
ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల్లో 19 మందికి అత్యవసర చికిత్స కోసం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇకపోతే నేడు ఒక రోజే విదేశాల నుంచి వచ్చిన వారిలో 14 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించగా, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 92 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ చేయడం జరిగింది.