ఈ మధ్య దేశంలో ఏదో ఒక మూలన రోజుకి పదుల సంఖ్యలో నేరాలు-ఘోరాలు కొనసాగుతున్నాయి. ఇకపోతే తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఓ సంఘటన అందరినీ ఆశ్చర్య పడేలా చేసింది. ఆమెకు తన భర్త అంటే చాలా ఇష్టం. అలాంటి భర్త మరో యువతిని వివాహం చేసుకుని వేరే కాపురం పెట్టడంతో తనతో కలిసి సంసారం చేయకపోవడంతో తన భర్తని ఎలాగైనా తిరిగి రప్పించు కోవాలనుకున్నది ఆవిడ. అయితే ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అన్ని విఫలమయ్యాయి. ఇక దీనితో విసిగిపోయి.. చేసేదేం లేక ఓ సుపారీ గ్యాంగ్ కు సుమారు రెండు లక్షల రూపాయలను సుమారుగా ఇచ్చి తన భర్తను కిడ్నాప్ చేయించింది ఆ భార్య. ఇకపోతే ఈ సంఘటన మొత్తం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో గురువారం నాడు చోటుచేసుకోగా ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

IHG


దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... సంవత్సరం క్రితం రత్న గౌతమ్ అనే మహిళను షాహిద్ వివాహమాడాడు. అప్పట్నుంచి తన మొదటి భార్యను షాహిద్ పట్టించుకోకపోవడంతో రత్న తోనే సంసారాన్ని కొనసాగిస్తున్నాడు. అంతేకాదు తన మొదటి భార్య వద్ద ఉన్న ఆభరణాలు నగదును కూడా రెండో భార్యకు ఇచ్చేసేవాడు. తన భర్త ప్రవర్తన నచ్చని ఆమెకు అనేక ఆలోచనలు రావడంతో చివరికి ఓ సుపారీ గ్యాంగ్ కు రెండు లక్షల రూపాయలు ఇచ్చి తన భర్త షాహిద్ ను కిడ్నాప్ చేయాలని ఆమె కోరింది.

 


అయితే జూన్ ఏడో తేదీ మధ్యాహ్నం 1:00 సమయంలో అతను కూరగాయల కోసం బయటకు రాగా ఆ సమయంలో కిడ్నాప్ చేసిన గ్యాంగ్ హసన్‌ జిల్లాకు అతనిని తీసుకు వెళ్లారు. అయితే ఆ గ్యాంగ్ తెలివిగా రత్న నుంచి డబ్బును డిమాండ్ చేశారు. అది కూడా ఏకంగా పది లక్షల వరకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అయితే నేను రెండు లక్షల రూపాయలు ఇస్తాను అని తన భర్తను వదిలి పెట్టాలని కిడ్నాపర్లను కోరగా వారు ఒప్పుకోలేదు. దీంతో ఏమి చేసేది లేక పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటకు వచ్చింది. చివరకు రోమా ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతే కాదు డబ్బు తీసుకున్న సఫారీ గ్యాంగ్ లో నలుగురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: