దేశంలో కరోనా ఫిబ్రవరి లో మొదలైనప్పటికీ.. మార్చిలో కేసులు పెరుగుతున్నాయన్న భయంతో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వ్యాపార వ్యవస్థ చిన్నా భిన్నమైంది. అయితే ఈ మద్య లాక్ డౌన్ సడలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇక దేశంలో మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు లో కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. వీటి తర్వాత ఢిల్లీలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండటంతో... మార్కెట్లను మూసేయడమే మంచిదని 88 శాతం మంది వ్యాపారులు అభిప్రాయపడ్డారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) నిర్వహించిన సర్వేలో వ్యాపారులు ఏమనుకుంటున్నారో వెల్లడైంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని 99.4 శాతం మంది అభిప్రాయపడ్డారు.

 

 మార్కెట్లను తెరిస్తే... మార్కెట్ల ద్వారా వైరస్ విస్తరిస్తుందని 92.8 శాతం మంది తెలిపారు. కరోనా డిమాండ్ కు తగ్గట్టు ఢిల్లీలో వైద్య సదుపాయాలు లేవని 92.7 శాతం మంది చెప్పారు. మార్కెట్లను మూసేయడం ద్వారా కరోనా విస్తరణను కట్టడి చేయవచ్చని 88.1 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో సీఏఐటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. మరోవైపు రేపు మధ్యాహ్నం ఢిల్లీలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో సీఏఐటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. ఇక సమావేశ విషయాలు వెంటనే ప్రభుత్వానికి కూడా సిఫారసు చేయనుంది. ప్రభుత్వాలతో సహకరించుకుంటూ, కరోనాను కట్టడి చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా సీఏఐటీ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్ వాల్ చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: