ఓ తల్లి అక్రమ సంబంధం ఇద్దరు కొడుకుల జీవితాలను బలి తీసుకుంది. భర్తకు దూరంగా ఉంటున్న మహిళ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో వెళ్లిపోయిందనే బాధతో ఆమె ఇద్దరు కుమారులు ఆత్మహత్య చేసుకున్నసంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పుదుక్కోట, నామన సముద్రానికి చెందిన వెంకటాచలం(47) కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య జయదీప(40), విఘ్నేశ్వరన్ (20), యోగేశ్వరన్(18) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

 

 

పెద్ద కుమారుడు విఘ్నేశ్వరన్ పుదుక్కోటై ప్రభుత్వ కాలేజీలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రెండో కొడుకు యోగేశ్వరన్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యాభ్యసము చేస్తున్నాడు. వెంకటాచలానికి ఆరోగ్యం సరిగా లేకపోవటంతో కుటుంబం నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇద్దరు కుమారులతో జయదీప వేరుగా జీవనం సాగిస్తోంది. 

 

 

ఈక్రమంలో స్థానికంగా వడ్డీ వ్యాపారం చేసే ఆమెకు అదే ప్రాంతానికి చెందిన షణ్ముగం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. షణ్ముగం అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి రాసలీలలు సాగించేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు కొడుకులు పద్ధతి మార్చుకోవాలని తల్లిని మందలించారు. అయినా పట్టించుకోని ఆమె ప్రియుడితో సంబంధం కొనసాగిస్తూనే ఉంది. 

 

 

ఈ క్రమంలో జయదీప రెండు రోజుల క్రితం తాను ప్రేమించిన వ్యక్తితో  పిల్లలను వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన ఆమె కుమారులు ఇద్దరూ శుక్రవారం నాడు  తల్లి చీరతో, ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్నహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వీరిద్దరూ ఇంటి తలుపులు తీసి బయటకు రాకపోవటంతో  ఇరుగు పొరుగు వారు తలుపులు పగల గొట్టి చూడగా ఈ విషాదం వెలుగు చూసింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: