భారతీయ సంప్రదాయంలో పెళ్లి అనేది అద్భుతమైన ఘట్టం.. పాతికేళ్ల తర్వాత మిగిలిన జీవితాన్ని గడపడానికి మరో వ్యక్తితో ముడి వేస్తారు.. మూడు ముళ్ళతో.. ఏడు అడుగులతో, పచ్చని పందిరిలో ఆ జంట ఏకమవుతారు.. అలాంటి పవిత్రమైన పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే ఒకరితోనే జరుగుతుంది. కానీ ఇక్కడ ఓ యువతి ఇద్దరితో వివాహం చేసుకుంది.అది కూడా ఒక్కరోజు తేడాతో అదేంటి అనుకుంటున్నారా అదేనండీ.. ఒకరేమో పెద్దలు చూసిన వారు మరోకరేమో ప్రేమించిన ప్రియుడు.

 

 

 


వివరాల్లోకి వెళితే.. ఈ విచిత్రం నల్గొండ జిల్లా కనగల్ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.శాబ్దులాపురానికి చెందిన మౌనిక అనే యువతి, తన కుటుంబ సభ్యులతో కలిసి పదేళ్లుగా కురంపల్లిలో నివాసం ఉంటుండగా, ఆమెకు దేవరకొండ ప్రాంతానికి చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరి వివాహం శుక్రవారం నాడు జరిగింది. అయితే, తనకు వరుసకు మామయ్యే రాజేశ్ అనే యువకుడిని మౌనిక కొన్నేళ్లుగా ప్రేమిస్తోంది. మౌనిక వివాహమైన కొంత సేపటికి, ఆ ప్రాంతానికి రాజేశ్ వచ్చాడు. రాజేశ్ ను చూసిన మౌనిక, అతన్ని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ, బాధపడింది.

 

 

 


అయితే ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక.. కట్టుకున్న భర్తతో ఎలా కాపురం చేయాలి అనే ఆలోచనతో తర్జన భర్జన పడింది.. ప్రేమించిన ప్రేమ తాళి కట్టిన భర్తతో కాపురానికి ఒప్పుకోక పోవడంతో.. ఒక నిర్ణయం తీసుకున్నది. ఏది ఏమైనా కూడా తన ప్రేమను బ్రతికించు కొవాలని గట్టిగా నిర్ణయించుకుంది. దాంతో ప్రియుడు రాజేశ్ కు విషయం చెప్పింది. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అది కూడా వెంటనే జరిగి పోవాలని నిర్ణయించుకుంది. దానికి అతను సరే అనడంతో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో నిన్న ఇద్దరు ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. కేవలం ఒక్క రోజు తో రెండు పెళ్లిళ్లు చేసుకుని  రికార్డ్ సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: