ఈ మధ్య  ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని వణికించిన కరోనా వల్ల చాలా మంది నష్టాలను చవి చూశారు.. అతేకాదండోయి లాక్ డౌన్ పీరియడ్ లో  మధ్యతరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ కరోనా కారణంగా రైతన్నలు చాలా నష్ట పోయారన్న  విషయం తెలిసిందే. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక అమ్ముకోవడానికి సరైన మార్కెట్ లేక పంటను వదిలేశారు. అలాంటి రైతులకు ఈ సంవత్సరం వర్షాలు ఊరటను ఇచ్చాయి. 

 

 

 

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో  పది రోజుల ప్రవేశించాయి.విజయవాడ, కృష్ణా జిల్లాలతో పాటుగా పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది.తెలంగాణలోని పెద్దపల్లి, నిజామాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోకి నిన్న రుతుపవనాలు ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రెండు మూడు రోజుల్లోనే ఇవి రాష్ట్రమంతా విస్తరిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయని, వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. 

 

 


శని, ఆదివారాల నాటికి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉందన్నారు.మాములుగా ఈ నెల 8నే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉండగా, ఈసారి మూడు రోజులు ఆలస్యంగా 11న వచ్చినట్టు అధికారులు తెలిపారు. అయితే, గతేడాదితో పోలిస్తే మాత్రం పది రోజుల ముందే రాష్ట్రంలోకి వచ్చేశాయి. మరోవైపు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాల దగ్గర ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరి ఈ వారం వాతావరణం రైతన్నల కళలను తీర్చిందనే చెప్పాలి..

 

 

 

ఈ అల్పపీడనానికి తోడుగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  ఒకటి రెండు చోట్ల మాత్రం అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.అందులో హైదరాబాద్ జంట నగరాల్లో వర్ష సూచన ఎక్కువగా ఉంటుందని అంచనా...మొత్తానికి ఈ వర్షాలు రైతన్నల కష్టాలను తీర్చబోతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: