రెండు రోజుల క్రితం ఈ.ఎస్.ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న అచ్చెన్నాయుడును బెయిల్ పై విడుదల చేయించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆరోగ్యపరమైన కారణాలను చూపించి బెయిల్ కోరే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే సినీ నిర్మాత నట్టికుమార్ నయీంకు అచ్చెన్నాయుడుకు లింక్ లు ఉన్నాయనే ఆరోపణలు చేశారు. 
 
నయీంకు అచ్చెన్నాయుడికి లింక్ లు ఉన్నాయని.... నయీం ద్వారా అచ్చెన్నాయుడు అనేక దందాలు జరిపించాడని ఆరోపణలు చేశారు. . నయీం చనిపోయి చాలా కాలమైంది. దాదాపు అందరూ నయీం గురించి మరిచిపోయారు. ఇలాంటి సమయంలో నట్టికుమార్ అచ్చెన్నాయుడి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నట్టికుమార్ సినీ రంగానికి చెందిన వారి గురించి చెబుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 
విశాఖ ఏరియాలో కూడా నయీం అక్రమ దందాలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. నట్టికుమార్ తాజా స్టేట్ మెంట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. నట్టికుమార్ ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడిన నట్టి కుమార్ అచ్చెన్నాయుడు, నయీంకు లింకులు ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 
నయీంతో లింకులు ఉన్నట్లు ఆధారాలతో సహా నిరూపిస్తే అచ్చెన్నాయుడు రాజకీయ సన్యాసం చేస్తారా...? అంటూ గతంలో సవాల్ విసిరారు. 2016లో నయీంకు చెందిన మనుషులు కొందరు తనపై దౌర్జన్యానికి కూడా దిగారని..... పోలీసుల దగ్గరకు వెళ్తే ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రమేయం ఉందని మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని చెప్పారని... నయీం గ్యాంగ్ నుంచి ప్రమాదం ఉందని పోలీసుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు రక్షణ కల్పించారని పేర్కొన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: