ఈ మద్య కొన్ని సంఘటనలు చూస్తుంటే మన కళ్ల ముందు ఉన్నవారు ఒక్కసారే కనిపించకుండా పోతే ఎంత విషాదాలు నింపుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుంచి మనుషుల మానసిక పరిస్థితులు కూడా విభిన్నంగా తయారు అవుతున్నాయి. కొంత మంది మనుషులు కృర స్వభావంతో ఉంటున్నారు.. మరికొంత మంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.  తాజాగా పెళ్లైన కొన్ని గొంటల్లోనే ఓ నవ వధువు ఎవరికీ చెప్పా పెట్టకుండా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.  వివరాల్లోకి వెళితే, ఆదివారం నాడు రాజస్థాన్ కు చెందిన అలాపుర్ యువతికి వివాహమైంది. అత్తారింటికి వెళుతున్న మార్గంలో వాంతి వస్తోందని కారును ఆపించి, నదిలో దూకేసింది..  ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.. అయితే ఆ వధువు ఎందుకు ఆలా ఆత్మహత్య చేసుకుందో అంతా మిస్టరీ.

 

అమ్మాయిని అత్తారింటికి పంపే వేడుక కూడా ఘనంగా జరిగింది. తన భర్త, అత్తమామలతో కలిసి మధ్యప్రదేశ్ కు ఆమె బయలుదేరింది. ఇక యోపూర్ చంబల్ నదిపై వాహనం వెళుతున్న వేళ, ఆమె తనకు వాంతి వస్తోందని చెప్పింది. వెంటనే భర్త డ్రైవర్ ని కారు ఆపమని చెప్పాడు.. బయటకు వచ్చిన ఆ నవ వధువు..చంబల్ నదిలో దూకేసింది.

 

సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పెళ్లయిన తరువాత కూడా ఆమె బాగానే ఉందని, ఇంతలోనే ఏమైందో తమకు అర్థం కావడం లేదని వధువు తండ్రి వాపోయాడు. అప్పటి వరకు తమతో బాగానే ఉందని.. ఇలా ఎందుకు చేసుకుందో అందరూ షాక్ తిన్నారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: