ఈ మద్య కొంత మంది మనుషులు పశువుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. అసలు పశువుతో పోల్చడం కూడా పాపమే అనిపిస్తుంది. పూరాన కాలంలో రాక్షలు ఉన్నారో లేరో తెలియదు కానీ.. ఈ కాలంలో మాత్రం కొంత మంది రాక్షసులు మన మద్యనే తిరుగుతున్నారు.  పైకి మంచిగానే కనిపిస్తూ.. కొన్ని సందర్భం వచ్చినప్పుడు మాత్రం రాక్షసుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.  ఈ మద్య మూగ జీవాలపై వరుస దాడులు, హత్యలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే.  పసిపిల్లలపై కొంత మంది కామాంధులు రెచ్చిపోయి అత్యాచారాలు చేసి హత్యలు చేస్తున్నారు. వృద్దులని చూడకుండా పైశాచికంగా అనుభవించి హత్యలు చేస్తున్నారు.  ఇక భార్యా భర్తల అనుబంధాల్లో కూడా సమస్యలు తలెత్తి హత్యలకు దారి తీస్తున్న సందర్బాలు కూడా ఉన్నాయి.

 

ఇక అక్రమ సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భర్తను భార్య, భార్యను భర్త చంపుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ ప్రేమ జంట తాము ఏకంతంగా కలిసి ఉన్న సమయంలో ఓ బాలుడు చూశాడని.. తమ గుట్టు రట్టవుతుందని దారుణంగా చంపారు. ఈ దారుణ సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది. బాలుడి మరణంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుప్పూర్‌ జిల్లా సొట్టగౌండరపాళయంకు చెందిన తంగరాజ్‌-సుమతిల కొడుకు భవనేష్‌ (8) ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నాడు.  తల్లిదండ్రులు ఫ్యాక్టరీకి వెళ్లి వచ్చాకా బాలుడు కనిపించకుండా పోయాడు.

 

దీంతో అతని ఆచూకీ కోసం గాలించగా పల్లగౌండన్‌ పాళయంలో ఉన్న కొలను సమీపంలో మృతిచెంది కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై ఆరా తీయగా భవనేష్‌ను 17 ఏళ్ల యువతి తన వెంట తీసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పోలీసులు తమదైన స్టైల్లో ఆ జంటను ప్రశ్నించారు. తన ప్రియుడు అజిత్‌ (22) తో కలిసి ఉండగా భవనేష్ చూశాడని చెప్పింది.  ఆ విషయం తన కుటుంబ సభ్యులకు చెబుతాడని భయపడి హత్య చేశామని పేర్కొంది. అజిత్  అతన్నిచంపి కొలను దగ్గర పడేశాడని చెప్పడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: