సీఎంగా నారా లోకేష్(చినబాబు)...హోమ్ మంత్రిగా అచ్చెన్నాయుడు.. అవును మీరు వింటుంది నిజమే. నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే చినబాబు సీఎంగా, అచ్చెన్నాయుడు హోమ్ మంత్రిగా ఉండనున్నారు. ఇప్పటినుంచే తెలుగు తమ్ముళ్ళు ఈ విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. బాగా కసితో రగిలిపోతున్న తమ్ముళ్ళు...నెక్స్ట్ ఎన్నికల్లో చినబాబు సీఎంగా చేస్తే, అచ్చెన్నాయుడు హోమ్ మంత్రిగా ఉండి వైసీపీ మీద రివెంజ్ తీర్చుకోవాలని కోరుకుంటున్నారు.

 

టీడీపీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలని వైసీపీ ముప్పుతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. ఏ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా...వారిపై కేసులు పెట్టేసి బుక్ చేస్తున్నారు. అలాగే గత ఐదేళ్లు తమని ఇబ్బంది పెట్టిన టీడీపీ నేతలని టార్గెట్ చేసుకుని జగన్ ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడుని, నకిలీ ఇన్సూరెన్స్ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

ఇలా తమ నేతలని అరెస్ట్ చేయడంతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై తెగ ఫైర్ అయిపోతున్నారు. అటు చినబాబు కూడా ఎప్పుడూ లేని విధంగా జగన్‌పై విరుచుకుపడుతున్నారు. ‘ నా కార్యకర్తల జోలికి వచ్చారు. ఇప్పుడు మా నాయకుల జోలికి వస్తున్నారు. ప్రతిదీ గుర్తుపెట్టుకుంటా, వడ్డీతో సహ చెల్లిస్తా అంటూ చినబాబు జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయితే చినబాబు వార్నింగ్‌లకు తెలుగు తమ్ముళ్ళు ఇంకా జోష్‌తో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.;

 

మాకు లోకేష్‌లో కావలసింది ఇదే ఫైర్ అని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే చినబాబుకు సీఎం పీఠం మీద కూర్చోపెడితే వైసీపీని చెడుగుడు ఆడేస్తారని తమ్ముళ్ళు హడావిడి చేస్తున్నారు. అలాగే అచ్చెన్నకు హోమ్ మంత్రి పదవి ఇచ్చి వదిలేయాలని, అప్పుడు వైసీపీ నేతల పరిస్తితి ఏం అవుతుందో చూస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే తమ్ముళ్ళు కల నిజం అవ్వాలంటే 2024 వరకు వెయిట్ చేయాలి. అప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే చినబాబుకు సీఎం పీఠం దక్కడం కష్టమే గానీ, అచ్చెన్నకు హోమ్ మంత్రి పదవి దక్కే అవకాశముంది. ఇక ఇవన్నీ పక్కనబెడితే జగన్ ఉన్నంతవరకు టీడీపీ అధికారంలోకి రావడం కూడా ఓ కలగా మిగిలిపోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: