విజయనగరం కోటలో ట్విస్టు మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దివంగత ఆనంద గజపతి రాజు భార్య సుధా గజపతి వారి కూతురు ఊర్మిలా తెర పైకి వచ్చారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత కి ఎలాంటి వారసత్వ హక్కు లేదని సంచలన ఆరోపణలు చేశారు. తమ ఆస్తుల విషయంలో సంచయిత అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆరోపణలు వివాదాలు ఎలా ఉన్నా జీవో నెంబర్ 73 ప్రకారం సంచయిత మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా సంచయిత వర్సెస్ ఊర్మిలా వివాదం గజపతి కోటలో నువ్వానేనా అన్నట్టుగా ఉంది. వారసత్వ పోరు కోసం ఆధిపత్యపోరా ? లేకపోతే ఆస్తుల కోసం ఈ వివాదం నెలకొందా అన్నది ఎవరికి అర్థం కావటం లేదు.

IHG

సంచయిత ఆనందగజపతిరాజు కు సంబంధించి ఆస్తులకు దేనికి వారసురాలు కాదని, సంచయిత తల్లి ఆనందగజపతిరాజు మొదటి భార్య అయినా గాని ఆమె విడాకులు తీసుకోవడం, ఆ తరువాత ఆమె వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తో మేటర్ అక్కడితో ముగిసిపోయిందని ఆనందగజపతి రాజు ప్రస్తుత భార్య సుధా ఆమె కూతురు ఊర్మిళ ఈ విషయంలో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆనంద గజపతిరాజు వారసురాలిని అని బయట ప్రపంచానికి చెప్పుకుంటున్న సంచయిత నిరూపించుకో గలదా అంటూ సుధా మరియు ఊర్మిళ ఛాలెంజ్ చేస్తున్నారు.

IHG

చెన్నైలోని ఓ ఆస్తి విషయంలో తాము సంతకాలు ఫోర్జరీ చేశామంటూ గతేడాది మేలో సంచయిత తమపై విశాఖలో కేసు పెట్టారని, తమకు నోటీసులు అందడంతో లండన్ నుంచి ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. సంచయిత తల్లికి విడాకులిచ్చిన టైములోనే ఆస్తి పంపకాలు కూడా జరిగిపోయాయని, వాటికి సంబంధించిన ఆధారాలు అన్నీ తమ దగ్గర ఉన్నాయి అని సుధ మరియు ఊర్మిళ షాకింగ్ కామెంట్ చేశారు. సంచయిత ఏ మాత్రం ఆనందగజపతిరాజు కి వారసురాలు కాదని దీనిపై న్యాయపోరాటం చేసి తీరుతామని చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: