ఈ మధ్యకాలంలో బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా పోయింది. కళ్ళు మూసుకుపోయి... బంధాలు బంధుత్వాలు మరిచి  దారుణాలకు పాల్పడుతున్న ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇక్కడ ఒక కామాంధుడి వ్యాపారం బయటపడింది. ఏకంగా  తమ్ముడు భార్య పైన కన్నేశాడు ఇక్కడొక కామపిశాచి. ఏకంగా  తమ్ముడు భార్య అని కూడా చూడకుండా ఆమెపై లైంగికంగా వేధింపులకు దిగాడు. ఈ విషయం తెలుసుకున్న తమ్ముడు తల్లి వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని మొరపెట్టుకున్నాడు. అయితే కన్నతల్లి కూడా ఎంతో బాధ్యతారాహిత్యంగా మాట్లాడడంతో  రగిలి పోయి  ఏకంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ లేదు. 

 


ఈ  దారుణమైన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు తీసుకుంది. వివరాల్లోకి వెళితే... చేజర్ల మండలం తూర్పు కంభంపాడు కు చెందిన రమణయ్య రమణమ్మ  దంపతులకు చెంచురామయ్య వెంకటేశ్వర్లు అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.ఇద్దరు కొడుకులు బాతులు మేపుతూ  జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ఇటీవలే పెద్దకొడుకు చెంచురామయ్య తమ్ముడి భార్య విజయమ్మపై కన్నేశాడు. ఈ క్రమంలో ని తన కామ వాంఛ తీర్చాలి అంటూ సదరు మహిళలు వేధింపులకు గురి చేశాడు. మద్యం మత్తులో తమ్ముడు వారిపై లైంగిక వేధింపులకు దిగాడు.. 


 ఇక ఈ విషయం తమ్ముడు వరకు వెళ్ళింది. ఈ విషయంపై అన్నదమ్ముల మధ్య గొడవ కూడా జరిగింది. అయినప్పటికీ తన బుద్ధి మార్చుకోని అన్న  తమ్ముడు భార్యపై  లైంగికంగా వేధించడం మాత్రం ఆపలేదు. దీంతో ఈ విషయాన్ని తల్లి దగ్గర మొరపెట్టుకున్నాడు చిన్నకొడుకు. ఇక్కడ తల్లి కూడా తన పెద్ద కొడుకు ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో కోపంతో ఊగిపోయాడు. ఇటీవలే సర్వేపల్లి రిజర్వాయర్ వద్ద వెళ్లగా  అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది.  అప్పుడు కూడా తల్లి అన్నకు సపోర్ట్ చేయడంతో ఇక ఆక్రోశాన్ని పట్టలేక కన్నతల్లి పైన కత్తి దూసి అతి దారుణంగా హత్య చేశాడు. తర్వాత తల్లి శవాన్ని  కాలువలో  పడేసి పరారయ్యారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: