గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు కర్ణాటక ఆరోగ్య శాఖ బులిటెన్ ద్వారా మీడియాకు విడుదల చేసింది. కాకపోతే నేడు ఒక్క రోజే కొత్తగా 317 కరోనా కేసులు రాష్ట్రము మొత్తంగా నమోదు చేయడం జరిగింది. దీనితో రాష్ట్రంలో కేసుల సంఖ్య 7530 కి చేరుకుంది. అలాగే నేడు ఒక రోజు 322 మంది కరోనా వైరస్ నుంచి బయటపడి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా డిశ్చార్జ్ కేసుల సంఖ్య 4456 కు చేరుకుంది.
Covid19 Bulletin: 16th june 2020
— cm of karnataka (@CMofKarnataka) June 16, 2020
Total Confirmed Cases: 7530
Deceased: 94
Recovered: 4456
New Cases: 317
Other information: Telemedicine facility, Instructions to Tablighi Jamaat Attendees, Corona watch application and Helpline details.1/2 pic.twitter.com/fFjKtgyYsz
ఇక నేడు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి 7 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో 94 మంది కరోనా వైరస్ వల్ల మరణించారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తంగా 2976 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఇందులో మొత్తం 72 మందికి సీరియస్ గా ఉండడం వల్ల వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో 78 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 108 మందికి కూడా కరోనా పరీక్షలో పాజిటివ్ గా తేలింది. రాష్ట్రంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారితోనే ఎక్కువగా కరోనా వ్యాధి వ్యాప్తి జరుగుతోంది.