జేసీ బ్రదర్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు పెద్దగా కనిపించరు. అందులోనూ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అంటే మీడియాలో బాగా నానే పేరు. కాంట్రావర్సీ కామెంట్లతో.. ఆయన నిత్యం వార్తల్లో ఉంటారు. ఆయన సీమ భాష, ఆ భాషలో వెటకారం.. వ్యంగ్యం మీడియా దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తక్కువ వాడేమో కాదు. మొత్తానికి జేసీ బ్రదర్స్ అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు.

 

 

ఇక జేసీ బ్రదర్స్ సంపాదన విషయానికి వస్తే.. బాగా కలిగిన కుటుంబమే. అనేక వ్యాపారాలు ఉన్న జేసీ దివాకర్ రెడ్డి తన పరపతితో అన్నింటిలోనూ బాగానే నెగ్గుకొస్తారు. ప్రధానంగా ఆయన కొన్ని దశాబ్దాలుగా ట్రావెల్స్ వ్యాపారంలో ఉన్నారు. దివాకర్ ట్రావల్స్ తో పాటు ఇంకా అనేక పేర్లతో ఈ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు అయ్యింది కూడా ఈ ట్రావెల్స్ వ్యవహారం లోనే.

 

 

అయితే ఇంతకీ జేసీ దివాకర్ రెడ్డి ఆస్తులు ఎంత ఉంటాయి. ఈ విషయంపై వైసీపీ నాయకుల వ్యాఖ్యానం ఆసక్తికరంగా ఉంది. జేసీ దివాకరరెడ్డి అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించాడని హిందుపూర్ ఎంపీ గోరంట్ల మాదవ్ ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. అసలు జెసి దివాకరరెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తులను అమ్మితే అనంతపురం జిల్లా ప్రజలను ఏకంగా ఇరవై ఏళ్ల పాటు పోషించవచ్చని మాధవ్ సెటైర్ వేశారు.

 

 

అయితే.. ఫోర్జరీ డాక్యూమెంట్ల కేసులో అరెస్టైన జేసీ కుటుంబాన్ని పరామర్శించడం ద్వారా నారా లోకేష్‌ అవినీతి పరులకు మద్దుతు ఇచ్చినట్టయిందని గోరంట్ల మాధవ్ అంటున్నారు. ఇకనైనా చంద్రబాబు కుట్ర రాజకీయాలు మానుకోవాలని ఆయన సూచించారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ కామెంట్లు హాట్ హాట్ గా చర్చనీయాంశమవుతున్నాయి. మరి నిజంగానే జేసీ దివాకర్ రెడ్డి అంత ఆస్తిపరుడా.. అని పొలిటికల్ సర్కిళ్లలో డిస్కషన్లు ప్రారంభమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: