ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో తెలీదు అంటారు. దానికి చిన్నా పెద్దా ,కుల ,మత,జాతి తేడాలు ఏమి ఉండవు. ప్రేమ చాలా గొప్పది అయినా అన్ని ప్రేమ కథలు గొప్పగా ఉండవు. అన్ని ప్రేమ కథలు సుఖాంతం అవ్వవు కొన్ని ప్రారంభంలో ఆగిపోతాయి కొన్ని మధ్యలో మరికొన్ని చివర్లో ఆగిపోతుఉంటాయి.  అలాంటి ఓ ప్రేమ కథే వికారాబాద్ జిల్లా జరిగింది. ప్రేమించిన వ్యక్తిని కాదని ఇంట్లో వాళ్ళు వేరే వ్యక్తి తో వివాహం జరిపించారనే మనస్తాపంతో ప్రియుడితో కలిసి ఊరి చివర చెట్టుకు ఉరివేసుకుంది ఓ యువతి. 

 


వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పూలపల్లిలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మృతులు చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన సార కార్తీక్ ( 20 ) అదే గ్రామానికి చెందిన కటికె మీన ( 19 ) గా గుర్తించారు. మీనకు నెల క్రితం శషాంబాద్ మండలం మంచిరేవుల అబ్బాయితో వివాహం జరిగింది అయితే ప్రేమించిన వ్యక్తిని కాదని వేరొకరికిచ్చి పెళ్లి చేశారని తీవ్ర మనస్తాపానిక్ గురైంది. విషయాన్ని ప్రేమికుడికి చెప్పి ఇద్దరూ  కలిసి నవాబుపేట మండలం పులపల్లి వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

 

 

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క మిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నిన్న కాక మొన్న అందంగా పెళ్లి చేసి పంపించిన తమ కూతురు ఇలా ఆత్మ హత్య చేసుకోడంతో ఘొల్లుమంటున్నారు. మరో పక్క అబ్బాయి గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఊర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: