ఈ మధ్యకాలంలో చిన్నచిన్న కారణాల కే హత్యలు ఆత్మహత్య లు పెరిగిపోతున్నాయి. క్షణికావేశం లో తీసుకునే నిర్ణయా లు ఎంతో మంది ప్రాణాల ను బలి తీసుకుంటున్నాయి. అంతేకాకుండా మనుషులు మానవత్వం మరిచి దారుణాల కు పాల్పడుతున్నారు. బంధాలు బంధుత్వాలు మరిచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగా చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు తీస్తున్నారు. ఈ మధ్య కాలం లో ఇలాంటి ఘటన లు చాలానే తెరమీదకి  వస్తున్న విషయం తెలిసిందే. మనుషుల మధ్య తలెత్తిన వివాదాలు  ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళింతున్నాయి. 

 


 ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. భార్య భర్తల మధ్య మనస్పర్ధ లు కాస్త ఏకంగా  భర్త భార్య ప్రాణాలు తీసేంతవరకు వెళ్ళింది. తరచూ భార్య భర్త ల మధ్య గొడవ లు జరుగుతూ ఉండటం తో తీవ్ర కోపోద్రిక్తుడైన భర్త... భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికం గా కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది..... 

 


 కుటుంబ కలహాల తో భర్త భార్యను అతి దారుణం గా గొంతు కోసి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కాసిం పూర్ గ్రామం లో చేసుకుంది. కుటుంబ కలహాల తో కాసిం పూర్ గ్రామానికి చెందిన శంకర్ తన భార్య పుణ్యవతి ని అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. అయితే భార్య భర్తల మధ్య గతంలో మనస్పర్ధ లు తలెత్తి పుణ్యవతి గత ఎనిమిది నెలల క్రితం పుట్టింటికి వచ్చి అక్కడే ఉంది. గత ఐదు రోజుల కిందనే భర్త వద్దకు వచ్చిందని స్థానికులు తెలిపారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని శంకర్ ను  అదుపులో కి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: