కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ గడిచిన గత 24 గంటల్లో నమోదైన కరోనా వైరస్ వివరాలను బులిటెన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఇక అందులోని విషయాలను చూస్తే నేడు ఒక్కరోజే 204 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో రాష్ట్రంలో మొత్తంగా 7734 కేసులు నమోదయ్యాయి. ఇక నేడు ఒక్క రోజు మాత్రమే మొత్తంగా ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 102 కు చేరుకుంది. 

 

 

ఇక మరోవైపు నేడు ఒక్కరోజే 348 మంది కరోనా వైరస్ నుంచి విముక్తి పొంది హాస్పిటల్ నుంచి పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. దీనితో మొత్తంగా రాష్ట్రంలో నేటి వరకు 4804 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు.. అలాగే ప్రస్తుతం రాష్ట్రం మొత్తంగా 2824 కేసులు యాక్టివ్ గా కేసులు కొనసాగుతున్నాయి. ఈ యాక్టివ్ కేసులలో 72 మందిని ఐసీయూలో ఉంచి చికిత్స జరుపుతున్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కూడా నేడు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 106 మందికి కరోనా వచ్చినట్లు బులిటెన్ లో తెలపడం జరిగింది. అలాగే  రాష్ట్రం మొత్తంగా 35,586 మందిని అబ్జర్వేషన్ లో ఉంచి పరీక్షలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: