కొంతమంది చేసే విన్యాసాలు చేసే వాళ్లకు ఎలా ఉన్నప్పటికీ చూసే వాళ్లకు మాత్రం గుండె జారి పోయే లా ఉంటాయి. ఆ విన్యాసాన్ని చూస్తున్నంత సేపు ఒక్కసారిగా నాడీ వ్యవస్థ ఆగిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. అంతలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి కొన్ని విన్యాసాలు. తాజాగా ఇక్కడ ఒక వ్యక్తి అలాంటిదే చేశాడు. అయితే కొంతమంది మాటలు ఎక్కువ చెప్పి చేతలు తక్కువ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి మాత్రం.. అసలు ఏమీ మాట్లాడకుండానే తాను చేయాలనుకున్నది చేసి అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేశాడు. సైలెంట్ గా కొండపైకి వెళ్లి తాను చెయ్యాలనుకున్న స్టార్ట్ చేసేశాడు. కానీ ఇది చూసిన చుట్టుపక్కల వాళ్ళకి మాత్రం ఒక్క సారిగా గుండె జారిపోయింది అని చెప్పాలి. 

 


 ఇంతకీ ఏం చేశాడు అంటారా... అందరూ చూస్తుండగానే సైలెంట్ గా వెళ్లి కొండపైన నిలుచున్నాడు. అది కూడా సగం మాత్రమే పదాన్ని కొండకు తాకేలా..  మిగతా సగం గాలి లోనే ఉండేలా ఉంచాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అని అందరూ ఆసక్తిగా చూస్తుండగా ఒక్కసారిగా కొండ మీద నుంచి పల్టీ కొట్టాడు. కింద లోయలో  పడ్డామా ప్రాణాలు అటు నుంచి అటే గాల్లోకి వెళ్లిపోతాయి. దీంతో ఇది చూస్తున్నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. కానీ సదరు వ్యక్తి మాత్రం ఎంతో అనుభవం ఉన్న వాడిలా గాల్లోకి ఎగిరి మళ్లీ కొండపైన దిగాడు. 

 


 కొండ అంచుల్లో ఈ ప్రమాదకర విన్యాసం చేసేటప్పుడు సదరు వ్యక్తి కనీసం జాగ్రత్తలు తీసుకున్నా జాడలు కూడా కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన  హర్ష్ గోయెంకా  ఈ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది అతని ప్రతిభని మెచ్చుకోవాలా  లేదా మూర్ఖత్వం అని కొట్టిపారేయాల  అంటూ నెటిజన్లకు ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఒక ప్రశ్న వేసాడు. అయితే మెజారిటీ జనాలు ఈ స్టెంట్  చేసిన వ్యక్తిపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: