రోజు రోజుకి భారతదేశంలో మహిళలపై అత్యాచార సంఘటనలు ఎక్కువైపోతున్నాయి. రోజుకు దేశంలో ఏదో ఒక మూలన ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలను తీసుకు వచ్చిన కొందరు మూర్ఖులు మాత్రం అసలు మారడం లేదు. అయితే.. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఓ దారుణ ఘటన జరిగింది. వారింటి పొరుగువారే ఓ మహిళపై కత్తితో దాడి చేయగా.. అదికాస్తా ఆమె ఛాతిలో కత్తి గుచ్చుకుంది. అయితే ప్రాణ భయంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చగా,  ఆమె ఛాతి నుంచి 30 గంటల తర్వాత శస్త్రచికిత్స చేసి కత్తిని తొలగించారు కోయంబత్తూర్​ వైద్య కళాశాల ఆస్పత్రి వైద్యబృందం. ఇకపోతే ఆమె ప్రస్తుతం ఆమె సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

 


ఇక అసలు విషయంలోకి వెళితే ...  తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలోని క్రిష్ణగిరిలో హోసూర్​ ప్రాంతానికి చెందిన ఓ మహిళపై మే 25 తేదీన రాత్రి పొరుగువారే ఆమెపై కత్తితో పొడిచి పారిపోయారు. దాంతో ఆవిడ  రాత్రంతా నరకవేదన అనుభవించి మరుసటి రోజు అనగా మే 26న సేలంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరింది. ఇకపోతే అక్కడ చికిత్స ఫలించకపోవడంతో మళ్ళీ కోయంబత్తూర్​ లోని ఆస్పత్రికి తీసుకవెళ్లని అక్కడి వైద్యులు సూచించారు. 

 


అయితే సుమారు 30 గంటలు ప్రాణాలతో పోరాడిన తర్వాత... ఆవిడకు అనస్థీషియాలజీ , కార్డియోథొరాసిక్ సర్జరీ డాక్టర్లు 3 గంటల పాటు తీవ్రంగా శ్రమించి శస్త్రచికిత్స చేసి ఆమె లోపల ఉండే కత్తిని పూర్తిగా తొలగించారు. ఇకపోతే ఆ కత్తి ఆరు అంగుళాల కంటే ఎక్కువ లోతులోనే ఆమె శరీరంలోకి కత్తి వెళ్లినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ఆ కత్తి అదృష్టవశాత్తు ఆమె గుండెకు తాకకపోవడం కారణంగా ప్రాణాపాయం నుంచి బయటపడిందని డాక్టర్లు తెలిపారు. ఇక చివరకు ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత మూడు రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అవ్వడం జరిగింది. ఇకపోతే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కాబోలు.

మరింత సమాచారం తెలుసుకోండి: