మద్యం మత్తులో క్షణికావేశంలో కట్టుకున్న భార్య ను కడతేర్చాడు ఓ కిరాతక భర్త. కేవలం మామిడి పండ్ల విషయంలో అతడు తన భార్యను చంపాడని తెలిసి అందరూ షాక్ అయ్యారు అంటే అతిశయోక్తి కాదు. ఈ దారుణమైన సంఘటన ఒడిస్సా రాష్ట్రంలోని భద్రాక్ జిల్లాలోని జలముండ గ్రామం లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుంటే సోమవారం నాడు కార్తీక్ జేన అనే ఓ వివాహితుడు పూటుగా మద్యం తాగి అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకున్నాడు. ఆపై తన భార్యను పిలిచి మామిడి పండ్లను ఇవ్వాల్సిందిగా కోరాడు కానీ అప్పటికే పిల్లలు మామిడి పండ్లను తినడం తో ఆమె లేవు అని చెప్పింది. 

IHG
దాంతో మామిడి పండ్ల అడిగితే నువ్వు ఇవ్వవా అంటూ ఆమె పై విరుచుకుపడుతూ వెదురు బొంగు కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. దాంతో ఆమెకు బలమైన గాయాలు అవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. పిల్లలు గట్టిగా అరవడంతో స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి కుప్పకూలిపోయిన కార్తీక్ భార్యను హుటాహుటిన సమీపంలోని ధమనగర్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె తన తుది శ్వాస విడిచింది. అయితే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కార్తీక్ ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. 


అడిషనల్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ అధికారి కైలాష్ చంద్ర పరిదా మాట్లాడుతూ, నిందితుడు కార్తీక్ ని మంగళవారం అరెస్టు చేశామని, దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అలాగే మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు. ఏది ఏమైనా మద్యానికి బానిసైన మగవాళ్ళ కారణంగా ఆడవాళ్ళు, చిన్నపిల్లలు బ్రతికుండగానే నరకం అనుభవిస్తున్నారు. మద్యం మత్తు లో ఉండే రాళ్ల కారణంగా ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేక పోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: