తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటింది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2174 కేసులు నమోదయ్యాయి. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉన్న చెన్నై, దాని చుట్టుపక్కల జిల్లాలు తిరవళ్లూర్​, చెంగల్​పేట్, కాంచీపురంలో శుక్రవారం నుంచి 12 రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్​డౌన్​ను అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. జనసాంద్రత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే దాదాపు 70 శాతానికిపైగా కేసులు నమోదవుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది.

 

 277 మంది రోగులు మిస్సింగ్​.. 

 

రేపటి నుంచి లాక్​డౌన్ అమల్లోకి రానున్న తరుణంలో చెన్నైలో 277 మంది కరోనా రోగులు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. వీరిని ట్రేస్​ చేసేందుకు అధికారులు ప్రయత్నించినా ఎలాంటి పురోగతి లేదు. వీరిలో కొందరు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారు కాగా.. మరికొందరు తప్పుడు వివరాలు ఇచ్చిన కారణంగా గుర్తించడం కష్టమవుతోందితమిళనాడులో ఇప్పటివరకు 50 వేల 193 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 576 మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నై ప్రాంతంలోనే 35 వేల మందికిపైగా బాధితులున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి 10 లక్షల మందికి 9 వేల 845 పరీక్షలు నిర్వహిస్తున్నారు. వంద శాతానికి 6.4 శాతం మందికి పాజిటివ్​గా తేలుతోంది.

 


లాక్ డౌన్ వివరాలు... 

 

చెన్నై, తిరవళ్లూర్​, చెంగల్​పేట్, కాంచీపురం జిల్లాల్లో 12 రోజులు లాక్​డౌన్​ అమల్లో ఉంటుంది. ఆ ప్రాంతాల్లో నిత్యవసర సేవలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఉంటుంది. జూన్ 21, 28 రెండు ఆదివారాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా పూర్తిస్థాయి లాక్​డౌన్ విధిస్తారు. దుకాణాలు మూసివేయాలి. కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల విక్రయాలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే అనుమతి.అత్యవసరం అయితేనే ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి.హోటళ్లు, రెస్టారెంట్లకు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి. పార్సిల్ సుదుపాయం మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఫుడ్​ డెలివరీ సంస్థలకు అనుమతి.చెన్నై దాటి వెళ్లాలంటే ఈ-పాస్ తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: