డబ్బు ఎవరికి చేదు.. ప్రతి ఒక్కరికీ డబ్బుతో ఎంతో అవసరం ఉంటుంది.. అయితే ఆ డబ్బు నిజాయితీగా సంపాదిస్తే మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. కొంతమంది అక్రమంగా సంపాదించి జల్సా చేయడం చూస్తున్నాం.  అలాంటి వారు ఎప్పటికైనా పోలీసులకు చిక్కి కట కటాల పాలు అవుతున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. తాజాగా ఓ భర్త డబ్బుకు కక్కుర్తి పడి బంగారం లాంటి భార్యనే చీటింగ్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. గచ్చిబౌలికి చెందిన ఒక మహిళకి కరీంనగర్‌ కి చెందిన సంతోష్ కుమార్‌కి మాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.  వీరిద్దరి కాపురం సజావుగానే సాగింది.. పెళ్లైన తర్వాత ఆమెకు అమెరికాలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లింది.

 

భర్త మాత్రం హైదరాబాద్ లోనే ఉండిపోయాడు. అయితే తనకు కొన్ని ఖర్చులు ఉన్నాయని.. అందుకు డబ్బు కావాలని భార్య నుంచి  రూ.63 లక్షలు తీసుకున్నాడు.  హాయిగా వాటితో జల్సా చేయడంతో మరింత డబ్బు అవసరం పడింది. అంతే భార్యను నేరుగా అడిగే ప్రశ్నలు అడుగుతుందని.. ఓ కన్నింగ్ ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడి పేరు అయిన సత్యహర్ష రెడ్డి అనే పేరుతో భార్య మొబైల్, మెయిల్‌కు అసభ్యకర సందేశాలు, వీడియోలు పంపడం మొదలుపెట్టాడు. ఇలా వేరే వ్యక్తి లా ఆమెకు మెసేజ్ లు పెట్టడం చూసి ఇది తన భర్త పనే అయి ఉండొచ్చన్న అనుమానం ఆమెకు కలిగింది.

 

అంతే  గచ్చిబౌలి సైబర్ క్రైం పోలీసులకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసింది. ఆమెకు అసభ్యకర సందేశాలు సంతోష్ కుమారే పంపినట్టు సైబర్ పోలీసులు తేల్చారు. ఇంకేముంది బంగారం లాంటి భార్యను భర్త హోదాలో మర్యాదగా అడిగి ఉంటే గౌరవంగా ఉండేది.. కానీ డబ్బుకు కక్కుర్తి పడి భార్యను బెదిరించి డబ్బులు దండుకోవాలనుకున్నాడు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులు గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సంతోష్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: