కరోనా లాక్​డౌన్​ సమయంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఓ యువకుడు తన ప్రతిభకు సానబెట్టాడు. తనలోని కవితా నైపుణ్యాన్ని బయటకుతీసి తులూ భాషలో ఓ పద్యాన్ని రాశాడు. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. ఇప్పుడు అతనికి ఎనలేని ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక పద్యం రాస్తేనే ఇంత గుర్తింపు ఎందుకు అనుకుంటున్నారా?

 

మాస్టర్​ ప్రణేశ్​.. కర్ణాటక మంగళూరులోని ఇంజినీరింగ్​ ద్వితీయ సంవత్సరం విద్యార్థి. రచనల పట్ల ఆసక్తి ఉన్న ఇతను గతంలో ఎన్నో పద్యాలు రాశాడు. అదీ తులూ భాషలో. అయితే.. కరోనా లాక్​డౌన్​ కాలంలో ప్రణేశ్​ రాసిన 'తులునాద ఇసిరీ' అనే ఓ పద్యానికి విపరీతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఏకంగా వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డుల్లో చోటు సంపాదించింది.

 

పద్యం రాస్తే ప్రపంచ రికార్డు ఏంటి అనుకుంటున్నారా.. ? ప్రణేశ్​ రాసింది అతిపెద్ద పద్యం మరి. 2 వేల 241 తులూ పదాలను ఉపయోగించి.. పేజీల కొద్దీ రాశాడు. ఇది కొలిస్తే 21 అడుగుల మేర ఉంటుందట. మొత్తం 108 పేరాలు, 432 లైన్లలో.. తన కవితా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.

 

పద్యంలో తులూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తన ప్రతిభకు సానబెట్టాడు ప్రణేశ్​. ఇంకా దైవారాధన, ఆధ్యాత్మిక కేంద్రాలు, తులూ పండుగలు, సాంస్కృతిక పోటీల ప్రాముఖ్యాన్ని వివరించాడు​. ప్రణేశ్​ గతంలోనూ ఎన్నో తులూ పద్యాలు రాశాడు. తన బహుముఖ ప్రజ్ఞకు గుర్తింపుగా అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నాడు.

 


ఈ వార్త విన్న చాలామంది ఆశ్చర్యంతో ముక్కు మీద వేలు వేసుకున్నారు. కొంతమంది మరి అంత ఖాళీగా ఉంటే ఈ పేజీ లు ఎలా రాయగలిగారు అని ఆశ్చర్యపోతున్నారు.
ప్రణేశ్  నేటి తరం పద్యాలు, గేయాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని కానీ వాటి ద్వారా జ్ఞానం, విజ్ఞానం రెండు వస్తాయని ఎవరు అర్థం చేసుకోవడం లేదని, పాఠశాలల్లో, నేటి విద్యాలయాల్లో నేర్పించడం లేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: