కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. ఈరోజు ఏకంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు కాగా ఓ కరోనా మరణం కూడా సంభవించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 118 పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో ఇప్పటివరకు మొత్తం 2912కేసులు నమోదుకాగా అందులో 1380కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 1509మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 21 మంది మరణించారు. 
 
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడు లో ఈరోజు 2115కేసులు నమోదు కాగా  ఈఒక్క రోజే రికార్డు స్థాయిలో 41మంది మరణించారు. ఆ రాష్ట్రంలో ,కేసుల సంఖ్య 54449కు చేరగా ఇప్పటివరకు 666 కరోనా మరణాలు సంభవించాయి.
 
కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈరోజు 465కేసులు నమోదుకాగా తెలంగాణ లో 499కేసులు బయటపడ్డాయి. ఓవరాల్ గా దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 390000దాటగా 12700మరణాలు చోటుచేసుకున్నాయి.     

మరింత సమాచారం తెలుసుకోండి: