దేశంలో కరోనా విజృభిస్తున్నా విషయం అందరికి తెలిసిందే. దింతో దేశంలో గత మూడు నెలలుగా లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు తీవ్ర డిప్రెషన్ కి లోనైయ్యాడు. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం అభిమానుల గుండెలు ప‌గిలేలా చేసింది. ఆయ‌న మ‌ర‌ణాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్ప‌టికే సుశాంత్ మృతిని త‌ట్టుకోలేక ఆయ‌న వ‌దిన‌, అభిమాని క‌న్ను మూశారు.

 

 

అయితే తాజాగా వైజాగ్‌కి చెందిన యువ‌తి సుశాంత్ మ‌ర‌ణంతో క‌ల‌త‌చెంది ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కాగా ఆయన తీవ్ర డిప్రెషన్‌ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుశాంత్ మృతిపట్ల పలువురు సెలెబ్రిటీలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

 

 

అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఓ మహిళా అభిమాని తీవ్ర మనస్థాపానికి గురై ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైజాగ్‌లో చోటు చేసుకుంది. బీహార్ నుండి విశాఖపట్నం శ్రీహరిపురంకు వలస వచ్చి ఉంటున్న కుటుంబానికి చెందిన ఓ యువతి ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది.

 

 

అయితే లాక్ ‌డౌన్ కారణంగా స్కూలుకు సెలవులు ఉండటంతో ఇంటి వద్దే ఉంటూ టిక్ ‌టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుందట.కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటే ఇష్టమైన ఆ యువతి ఆయన ఆత్మహత్యను జీర్ణించుకోలేకపోయిందని, అప్పట్నుండి కుటుంబ సభ్యులతో ఎక్కువ మాట్లాడకుండా ఉండేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

 

 

ఇక టిక్ ‌టాక్‌లో సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన వీడియోలను ఎక్కువ మొత్తంలో చూసి తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి ఆత్మహత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: