కొంతమంది జల్సా లకు అలవాటు పడి డబ్బు కోసం ఎంతకైనా దిగజరుతారు. అలాంటి ఓ యువకుడు భార్య దగ్గర డబ్బు దోచుకోడానికి ఒక చండాలమైన పని చేసాడు. ఇంట్లో పెద్దలు అందరి మధ్య బాగా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత భార్య వృత్తి రీత్యా చాలా డబ్బు ఇచ్చి వెళ్ళింది. అయినా ఆశ చాలక వేరే మొబైల్ నంబర్ నుంచి  ఆస్లీల దృశ్యాలను భార్య ఫోన్ కి పంపించి డబ్బు గుంజుదామని ప్రయత్నం చేసి చివరికి జైలు పాలయ్యాడు. 

 


సభ్యసమాజం తలా దించుకునే ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలికి చెందిన ఒక మహిళకి కరీంనగర్‌ కి చెందిన సంతోష్ కుమార్‌ కి మాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత ఆమె ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లింది. భర్త సంతోష్ కుమార్ ఇక్కడే ఉండిపోయాడు. దీంతో తన అవసరాల కోసం భార్య నుంచి రూ.63 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు అయ్యేదాక విచ్చల విడిగా జల్సాలు చేసాడు. చివరికి సొమ్ములన్ని అయిపోయిన తరువాత ఎం చేయాలో తేలిక ఎలాగైనా భార్య దగ్గర ఇంకా డబ్బు గుంజాలి అని ఫిక్స్ అయ్యాడు.


ఇక అనుకున్నదే తడవుగా ఒక ప్లాన్ రెడీ చేశాడు. ముందుగా రచించిన పథకం ప్రకారం సొంత భర్త భార్యతో అతడి స్నేహితుడి పేరుతో చాటింగ్ చేసి కోటి రూపాయలు దోచుకున్నాడు. అవి చాలక పోవడంతో భార్యను బెదిరించి డబ్బులు దండుకోవాలనుకున్నాడు. తన పథకాన్ని అమలు చేసాడు. స్నేహితుడు పేరు ఉపయోగించి సత్యహర్ష రెడ్డి అనే పేరుతో భార్య మొబైల్, మెయిల్‌ కు అసభ్యకర సందేశాలు, వీడియోలు పంపడం మొదలుపెట్టాడు. వరుసగా ఓకే నంబర్ నుంచి అలా ఆస్లీల ఫోటోలు, వీడియో లు రావడం చూసి ఆమెకి అనుమానం వచ్చింది. తన భర్త మీదే అనుమానం వచ్చింది. ఈ అసభ్యకర సందేశాలు సంతోష్ కుమారే పంపుతున్నాడని ఆమెకు అనుమానం వచ్చింది.

 


దీంతో గచ్చిబౌలి సైబర్ క్రైం పోలీసులకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు అసలు విషయాన్ని కనిపెట్టారు. ఆమెకు అసభ్యకర సందేశాలు సంతోష్ కుమారే పంపినట్టు సైబర్ పోలీసులు తేల్చారు. దీంతో పోలీసులు గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సంతోష్ కుమార్‌ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: