కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా కర్ణాటక రాష్ట్ర ఆరోగ్యశాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలను హెల్త్ బులిటెన్ ద్వారా మీడియా పూర్వకంగా విడుదల చేయడం జరిగింది. ఇకపోతే నేడు ఒక్కరోజే కర్ణాటకలో 416 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 8697 కు చేరుకుంది. నేడు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 181 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. దీంతో రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5391 కు చేరుకుంది.
Covid19 Bulletin: 20th june 2020
— cm of karnataka (@CMofKarnataka) June 20, 2020
Total Confirmed Cases: 8697
Deceased: 132
Recovered: 5391
New Cases: 416
Other information: Telemedicine facility, Corona watch application and Helpline details.1/2 pic.twitter.com/kJjgoxDa3k
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 3170 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. నేడు ఒక్కరోజే తొమ్మిది మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 132 కు చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులలో 74 మందికి తీవ్ర అనారోగ్యం కారణంగా వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక నేడు ఒక్కరోజే విదేశాల నుంచి వచ్చిన 22 మందికి కరోనా పాజిటివ్ తేలగా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 116 మందికి కూడా కరోనా సోకిందని తెలుస్తోంది. గత పది రోజుల నుంచి కర్ణాటక రాష్ట్రంలో కేసులు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. దీనితో రాష్ట్రంలోని ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.