ఆపరేషన్ గరుడ ఈ పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే పేరు నటుడు శివాజీ. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రత్యేకహోదా కోసమని చెప్పి కేంద్రంలో ఉన్న బీజేపీతో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో శివాజీ తెరపైకి వచ్చి ఆపరేషన్ గరుడ అంటూ చాలా పెద్ద పురాణం చెప్పారు. అయితే ఆ పురాణం ఏంటో అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ పురాణం జోలికి వెళితే మన టైమ్ అంతా వేస్ట్ అవుతుంది.

 

కాకపోతే ఆపరేషన్ గరుడ అంటూ శివాజీ చెప్పిన సోది విషయాలు యథాతధంగా జరిగింది లేదు. కానీ కొన్ని సందర్భాల్లో జరిగిన ఘటనలు అలానే కనిపించాయి. ఆ ఘటనలని మన తెలుగు తమ్ముళ్ళు తెగ హైలైట్ చేసి ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే ఆపరేషన్ గరుడని అందరూ మరిచిపోయిన సమయంలో మళ్ళీ తెలుగు తమ్ముళ్ళు దాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీని సొంతం చేసుకునేందుకు ప్లాన్ మార్చి ప్రయత్నాలు చేస్తుందని, అందుకు జగన్‌కు చెక్ పెట్టే కార్యక్రమాలు చేస్తుందని చెబుతున్నారు.

 

సొంత పార్టీ నేతలే జగన్‌కు వ్యతిరేకమవుతున్నారని, వారే పార్టీని చీల్చి బీజేపీకి జై కొడతారని అంటున్నారు. అయితే ఇటీవల ఎంపీ రఘురామకృష్ణం రాజు సొంత పార్టీపై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అలాగే ఆనం రామ్ నారాయణరెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఇక వీరే జగన్ కొంపముంచనున్నారని తమ్ముళ్ళు కాస్త హడావిడి చేస్తున్నారు.

 

వీరి ద్వారా బీజేపీ...వైసీపీని చీల్చి జగన్‌ని జైలుకు పంపించి, ఏపీని సొంతం చేసుకుంటారని పనికిమాలిన ఊహాగానాలు చేస్తున్నారు. ఇక ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగంగానే చేస్తున్నారని అంటున్నారు. అయితే తమ్ముళ్ళ ఊహాగానాలు కలలో కూడా నెరవేరవడం కష్టం. అయితే ఇక్కడ రాష్ట్రాన్ని బీజేపీనే సొంతం చేసుకుంటే చంద్రబాబు టీడీపీని మూసుకున్నట్లేగా. ఇక ఆ లాజిక్ ఏమి లేకుండా తమ్ముళ్ళు పావలాకు కూడా పనికిరాని ఊహాగానాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: