ప్రేమ గుడ్డిదని అంటారు.. అవును ప్రేమలో పడ్డవారికి ఎవరూ కనినపించరు.. వారి ప్రపంచం వారిదే అంటారు.  ప్రేమికులు చేసే దైర్యం ఎవరూ చేయరంటారు.. చివరికి ప్రాణాలు తీసుకోవడానికైనా వారు వెనుకంజ వేయరు.  చిన్ననాటి నుంచి కని పెంచిన తల్లిదండ్రులను సైతం ఎదిరించి పోరాడుతారు.   అయితే కొన్ని ప్రేమల సఫలం అవుతాయి... కొన్ని ప్రేమలు విఫలం అవుతుంటాయి.   పుదుచ్చేరిలోని కారైక్కాల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.పెద్దలను ఎదిరించి హిజ్రాతో నెల రోజులుగా సహజీవనం చేస్తున్న యువకుడు ఆమెతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కారైక్కాల్‌ జిల్లాలోనికి తిరునల్లారుకు చెందిన దిలీప్‌ (26)కు ఆరు నెలల క్రితం నిరావీ ప్రాంతానికి చెందిన శివానీ(30) అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. క్రమంగా అదికాస్తా ప్రేమగా మారి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు.

 

 

కారైక్కాల్ సమీపంలోని తిరునల్లారుకు చెందిన దిలీప్ (26)కు, నిరావీకి చెందిన శివానీ (30) అనే హిజ్రాతో ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఈ విషయం   తెలిసిన దిలీప్ తల్లిదండ్రులు మందలించారు. అయినప్పటికీ పట్టించుకోని దిలీప్.. శివానీని మర్చిపోలేనని తెగేసి చెప్పాడు. నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి కారైక్కాల్‌ ఒడుదురై ప్రాంతంలో శివానీతో కలిసి కాపురం పెట్టాడు.  అయితే ఇద్దరి మధ్య కొద్దిరోజులుగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఇద్దరూ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

 

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మరోవైపు పెద్దల అంగీకారంతో చేసుకోని పెళ్లి కావడంతెో వారి తల్లిదండ్రులు చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది.  ప్రేమించుకోవడం తప్పుకాదు.. కానీ పెద్దలను ఒప్పించి చేసుకోవడం మంచిదని పెద్దలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: