చైనాకు తగిన శాస్తికి రంగం సిద్ధమైపోయింది. ఇంతకాలం తెంపరితనంతో రెచ్చిపోతున్న చైనాకు తనదైన శైలిలో గట్టి షాకులు ఇచ్చేందుకు మోడీ రెడీ అయిపోయారు. మహాబలిపురం వచ్చి చాయ్ తాగి మంచి కబుర్లు చెప్పి పరిసరాలను ప్రక్రుతి ప్రేమికుడిగా ఆనందించిన  జిన్ పింగ్ కి మోడీలో మంచి స్నేహితుడు అనాడు  కనిపించాడు. ఇపుడు అరవీర భయంకరున్నికూడా జిన్ పింగ్ మోడీలో చూడబోతున్నాడు.

 

 

సరే నమ్మించి మోసం చేయడం ఎలాగో అలవాటే కాబట్టి చైనా కూడా మళ్ళీ మళ్లీ అదే చేస్తూ వస్తోంది. డొక్లాం దెబ్బకు కూసాలు కదిలినా కూడా చైనా మనసు మార్చుకోలేదు. ఇపుడు ఎలాంటి వివాదంలేని గాల్వాన్ లోయ మీద కన్నుపడింది. ఓ వైపు శాంతి చర్చలు జరుపుతూనే మరో వైపు నరమేధాన్ని కొనసాగించింది.

 

దానికి బదులు మోడీ తీర్చడమే ఇక మిగిలింది. అందుకే మోడీ ఇపుడు భారత సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చేశారు. చైనా సైనికులను చావగొట్టి చెవులు మూయండి అంటూ కచ్చితమైన అదేశాలనే మోడీ జారీ చేశారు. త్రివిధ దళాలతో జరిపిన సీరియస్ మీటింగులో ఇదే రకమైన ఆదేశాలు వెళ్లాయి.

 

భారత్ చైనా సరిహద్దు చాలా సుదీర్ఘమైనది. దాదపుగా మూడున్నర వేల కిలోమీటర్లు ఉంటుంది. ఈ సరిహద్దులో చైనా సైనికుడు ఎక్కడ కనిపించినా హద్దులు దాటినా వాడిని వెంటనే మట్టుపెట్టడమే భారత సైన్యం పని ఇపుడు. దాంతో డ్రాగన్ తోక ముడవకతప్పని పరిస్థితి ఎదురైంది.

 

ఓవైపు భూమార్గంలో మరో వైపు ఆకాశమార్గంలో ఇలా అన్ని వైపుల నుంచి చైనా మీద భారత్ పెద్ద నిఘానే పెట్టేసింది. దాంతో నక్కజిత్తుల చైనా భరతం పట్టేందుకు అంతా రెడీ అయిపోయింది. ఇపుడు చైనా దూకుడు చేస్తుందో, ఓడిపోయి వాడిపోయి వెనక్కు పోతుందో చూడాలి మరి. మరిక చైనాకు జింతాక జింతాకేఅని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: