కర్ణాటక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో నమోదైన covid - 19 కేసుల వివరాలను కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ ద్వారా మీడియాకు తెలియచేసింది. నేడు ఒక్కరోజే 453 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9150 కు చేరుకుంది. అలాగే నేడు ఒక్కరోజే 225 మంది సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. దీంతో కర్ణాటక రాష్ట్రం మొత్తంగా నేటి వరకు 5618 కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.

 

ఇక అలాగే నేడు ఒక్కరోజే కరోనా బారినపడి 5 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 137 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3391 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. ఇందులో 77 మందికి సీరియస్ గా ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు వైద్యులు.

IHG

 

 

నేడు ఒక్క రోజే విదేశాల నుంచి వచ్చిన 5 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 69 మందికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. నేడు కరోనా కేసుల సంఖ్యతో మొత్తం కేసులు 9 వేలకు రాష్ట్రంలో చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: